E-Paper
Advertisement

AP Telangana water Dispute | ముదురుతున్న జలవివాదం.. కృష్ట బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ

AP Telangana water Dispute | ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ఉంది. అయితే ఈ వివాదం ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

AP Telangana water Dispute | ముదురుతున్న జలవివాదం.. కృష్ట బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ
Advertisement
AP Telangana water Dispute

AP Telangana water Dispute(Telugu news live today):

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ఉంది. అయితే ఈ వివాదం ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

నవంబర్ 29న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఓ లేఖ రాసింది. ఇటీవల కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్ననిర్ణయం మేరకు నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వమే నియంత్రించేలా అనుమతులివ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారా మురళీధర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

అందుకోసం నవంబర్ 28 తేదీకి ముందున్న లేక ఘర్షణ జరిగక మునుపు పరిస్థితిని పునరుద్ధిరించేందుకు చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ బోర్డుకు లేఖలో విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాం వద్ద మోహరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకునేలా స్పందించాలని కృష్ణా నదీ బోర్డుకు మురళీధర్‌ విజ్ఞప్తి చేశారు.

నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్ద ఘర్షణ నేపథ్యంలో వివాదం పరిష్కిరంచడానికి బుధవారం రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ చేయనుంది. ఇప్పటికే ఒకసారి సమావేశాన్ని నిర్వహించగా, ఎన్నికల కారణంగా డిసెంబర్ 5 తరువాత సమావేశం నిర్వహించాలని జల శక్తిశాఖకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి విజ్ఞప్తి చేశారు.

Advertisement

ఈ నేపథ్యంలో డిసెంబర్ 6వ తేదీన జరిగే సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై చర్చలు జరుగుతాయని జలశక్తిశాఖ వెల్లడించింది.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×