Constable Drugs Case: హైదరాబాద్లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న యువకులు, తమ పాత స్నేహితులతో కలిసి రీయూనియన్ పేరుతో విందు చేసుకున్నారు. గచ్చిబౌలి మసీద్ బండాలోని ‘కోవ్ స్టేస్’ హోటల్ రూమ్ నెంబర్ 309లో ఈ తతంగం నడిచింది. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన ఈగల్ ఫోర్స్ అధికారులు.. అక్కడ ఏడుగురు యువకులు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు.
అయితే అక్కడ తనిఖీ చేసినా మత్తు పదార్థాలు దొరక్కపోవడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఐదుగురు గంజాయి సేవించినట్లు పాజిటివ్ అని తేలింది. పట్టుబడిన వారిలో మెఘేందర్, తేజేశ్వర్, సాయి ప్రసాద్, రమేష్లతో పాటు.. హైదరాబాద్ కమిషనరేట్ సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో AR కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రవి కూడా ఉన్నారు.
నిందితులు 2019 బ్యాచ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్ధులుగా గుర్తించారు. పట్టుబడిన వారిలో ప్రముఖ హోటళ్ల మేనేజర్లు ఉన్నారు. ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 41/2026 కింద కేసు నమోదు చేసి విచారణకు సిద్ధమయ్యారు. వివాహ వేడుకలో గంజాయికి అలవాటు పడినట్లు నిందితులు అంగీకరించారు.
ALSO READ: సైలెంట్గా వస్తుంది.. దూసుకుపోతుంది.. ఇదే మన హైడ్రోజన్ రైలు ప్రత్యేకత
గచ్చిబౌలిలో ఈగల్ ఫోర్స్ దాడులు
సైబరాబాద్ పోలీసులతో కలిసి కోవ్ స్టేస్ హోటల్ లో పార్టీపై మెరుపు దాడులు
హోటల్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న యువకులు
డ్రగ్స్ టెస్ట్ లో ఐదుగురికి పాజిటివ్
పట్టుబడ్డ వారిలో పోలీస్ కానిస్టేబుల్ రవి
CAR హెడ్ క్వార్టర్స్ లో పని చేస్తున్న రవి pic.twitter.com/4KmWR4UpqE
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2026