Medchal News: స్వేచ్ఛ, బ్యూరో: ఆశా వర్కర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ మండల కార్యదర్శి ఎం.నరేష్ మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18 వేల స్థిర వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
Also Read: How To Use Induction: ఇండక్షన్ స్టవ్ మీద వంట చేయడం ఎలా ? ఎలాంటి పాత్రలు అవసరం?
కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500 ప్రోత్సాహకాన్ని తక్షణమే అమలు చేయాలని, 2021 జూలై నుంచి బకాయిగా ఉన్న ఆరు నెలల PRC అరియర్స్ను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆశా వర్కర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకులు పద్మ, వసంత, మమత, సునీత, సునంద, తులసి, మంజుల తదితరులు పాల్గొన్నారు.