E-Paper
Advertisement

Manthani : ఆ జంట హత్యల తరహాలోనే..! బక్కన్న దంపతులపై కుట్ర పన్నారా..?

Manthani : ఆ జంట హత్యల తరహాలోనే..! బక్కన్న దంపతులపై కుట్ర పన్నారా..?
Advertisement

Manthani : మంథని నియోజకవర్గ తమ పార్టీ నేతలపై దాడి వెనుక భారీ కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. బక్కన్న దంపతులను హత్య చేయాలని బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. వామనరావు దంపతుల హత్య తరహాలో కుట్ర పన్నారంటున్నారు.

మహాముత్తారం మండలం మీనాజీపేటలో కాంగ్రెస్ నేత బక్కన్న దంపతులపై దాడి జరిగింది. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. బక్కన్న ప్రచారానికి ఆదరణ వస్తుండటంతో దాడి చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ దాడులకు దిగుతోందంటూ ఆరోపణలు చేశారు.

Advertisement

బీఆర్ఎస్ నేతల దాడికి నిరసనగా మంథని బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు సహా 28 మందిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కోరారు. కాంగ్రెస్ శ్రేణులే తమపై దాడికి పాల్పడ్డారని కౌంటర్ ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు, బక్కన్నతో సహా మరో ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై శ్రీధర్‌బాబు మండిపడ్డారు. మంథని చౌరస్తాలో నిలబడతా.. బీఆర్‌ఎస్‌ నేతలను వచ్చి చంపమను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీనాజీపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బక్కన్న దంపతులపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించి, నిరసన తెలిపారు. దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఓటమి భయంతో బీఆర్‌ఎస్‌ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Tags

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×