Sama Ram Mohan Reddy: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మరియు ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా కొందరు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ భవన్లో నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంచలన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సింగరేణి ఆఫీస్ని తగలబెట్టండి ఏమైనా చూసుకుందామంటూ బాల్కా సుమన్ ఘాటు వ్యాఖ్యలు దారునం అని అన్నారు.
Also read: తెలంగాణకు మరో గ్లోబల్ హబ్.. ఐటీ, టెక్ నిపుణులకు బంపర్ ఉద్యోగాలు!
కేసీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ విద్వంసకర విధానాలు అవలంబిస్తుందని అన్నారు. మాజీ ఎమ్మల్యే బాల్కసుమన్ సింగరుణి జీఎం కార్యాలయాన్ని, రైళ్వేలైన్లను ద్వంసం చేస్తామనే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అలజడులు సృష్టించాలని చూస్తున్న వారిపై పోలీసులు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సమర్థించేలా బాల్క సుమన్ మాట్లాడడంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ పేరుతో నిర్వహించిన మీటింగ్లో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ పలు నాయకుల నుండి ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: కొత్త కారు కొనేవారికి పండగే.. కియా లైనప్పై దిగొచ్చిన ధరలు.. ఏ మోడల్పై ఎంత తగ్గింపంటే?