E-Paper
Advertisement

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలైతే.. ఇప్పుడే రాజీనామా చేస్తా, బండి సంజయ్ సంచలనం

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలైతే.. ఇప్పుడే రాజీనామా చేస్తా, బండి సంజయ్ సంచలనం
Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆ హామీలు అమలు కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ గడ్డపై నుండి తాను ఈ సవాల్ విసురుతున్నట్లు ప్రకటించారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో గ్యారెంటీలు అమలవుతున్నాయని కేరళ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అసత్య ప్రచారాల వల్లే గతంలో బిహార్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైందని గుర్తు చేశారు.

Advertisement

తెలంగాణలోని ఏ గ్రామానికైనా కేరళ మీడియా ప్రతినిధులను తీసుకువెళ్దామని బండి సంజయ్ ప్రతిపాదించారు. అక్కడ గ్యారెంటీ పథకాల అమలును ప్రత్యక్షంగా చూపిస్తే తాను తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. లేనిపక్షంలో ముఖ్యమంత్రి తన పదవి నుండి తప్పుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ఈ సవాల్‌ను స్వీకరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి నిధులు లేవని సాకులు చెబుతున్న ప్రభుత్వం.. ఢిల్లీకి, కేరళకు ప్రత్యేక విమానాల్లో వెళ్లడానికి మాత్రం భారీగా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టడానికే నిధులు వాడుతున్నారని దుయ్యబట్టారు.

హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ అంశంపై స్పందిస్తూ.. ప్రజల నివాస ప్రాంతాల మధ్య దీనిని నిర్మించడం సరైన నిర్ణయం కాదని హితవు పలికారు. జనాలకు ఇబ్బంది లేని దూర ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

ALSO READ: గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసుపై దాడి.. సీఎం రేవంత్‌పై.. హరీశ్ రావు ఫైర్

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×