Nizamabad Politics: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ ను చోడీదీయ అంటున్నాడట ఆ నేత, బాస్ అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టు బట్టిన లేదు సార్ ఈ వయసులో అక్కడి నుంచి పోటీ చేయలేను, నా కొడుకు రాజకీయ భవిష్యత్తుకు నేను తొడుండాలి. మీరు చెప్పినట్లు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసినప్పటికి నేను మాత్రం నా పాత నియోజకవర్గం లోనే నాకు టికెట్ ఇవ్వకున్న నా కొడుకు కి ఇవ్వాలని దగ్గరుండి గెలిపించుకుంట అంటున్నాడట ఆ సీనియర్ నేత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఇంతలా పోటీ చేయమని టికెట్ ఇస్తా అంటున్న వద్దు సారు అంటున్న ఆ నేత ఎవరు.
బాన్సువాడ నియోజవర్గంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ నుంచి పోటీ చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి చెక్ పెట్టేందుకు బీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోటీ చేయాలని పట్టుపట్టారట బీఆర్ఎస్ అధినేత కేసిఆర్. అయితే బాన్సువాడ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఇన్చార్జి నియమించి టిఆర్ఎస్ చేపట్టే ఆందోళన కార్యక్రమాలు కావచ్చు పార్టీ పిలుపునిచ్చిన వాటిని దగ్గరుండి కార్యక్రమాలను చక్క పెట్టారట.
Also Read:Asus Gaming Laptops: ఇండియాలో కొత్త ROG, ProArt, TUF గేమింగ్ ల్యాప్టాప్స్ లాంచ్.. ధర ఫీచర్స్ ఇవే
కానీ ఇప్పుడు బాన్సువాడ నుంచి పోటీ చేయలేనంటూ ఆరోగ్యరీత్యా రాజకీయాల్లో దూరంగా ఉంటూనే కొడుకు బాజిరెడ్డి జగన్ ను వచ్చే ఎన్నికల్లో తన నియోజవర్గమైన నిజామాబాద్ రూరల్ నుంచి బీ ఆర్ ఎస్ టికెట్ ఇప్పించుకొని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేసీఆర్ వద్ద మొరపెట్టుకున్నారట. ఇప్పటికే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ నుంచి ఒకసారి, ఆర్మూర్ నుంచి ఒకసారి, నిజామాబాద్ రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బాజిరెడ్డి గోవర్ధన్ కు రాజకీయ అనుభవజ్ఞాన్ని ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడుకును ఎమ్మెల్యేగా చూడాలనేది ఆయన తపనట. ఇప్పటికే గత బిఆర్ఎస్ హయంలో జెడ్పిటిసిగా గెలిచి జడ్పీ చైర్మన్ కోసం ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ గా అయినా గెలిపించుకొని తన ఆశయం నెరవేర్చుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ ఆశిస్తున్నారట..
ఇప్పుడు బాన్సువాడ ను బాజిరెడ్డి గోవర్ధన్ చూడు దియా అంటూ ఇక నెక్స్ట్ ఎవరు అక్కడ బరిలో నిలేచేది ఎవరు గెలిచేది ఎవరు అంటూ బాన్సువాడ లో హాట్ టాపిక్ గా మారిందట. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తనయుడు భాస్కర్ రెడ్డి కి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించుకొని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట ఇలా తనయుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆలోచిస్తుంటే అక్కడ కాంగ్రెస్ కి ధీటుగా ఎవరు బీ ఆర్ ఎస్ అభ్యర్థి అంటూ రెండు పార్టీల్లో పొలిటికల్ హిట్ మొదలు అయిందట. చూడాలి తనయులను పోటీలో దింపాలని అనుకుంటున్నా బాజిరెడ్డి బాన్సువాడ నీ వదిలించుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన కొడుకును ఎన్నికలు పోటీలో దింపితే ఆయనకు దీటుగా బీఆర్ఎస్ నుంచి గెలిచే అభ్యర్థి కోసం పార్టీలో జెల్లాడ మొదలు పెట్టారు అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Bhu Bharati: ధరణి తెచ్చిన భూ భారతికి కష్టాలు.. పరిష్కారాలకంటే సమస్యలే ఎక్కువ..!