E-Paper
Advertisement

Beri Eshwar: నువ్వు నోటీస్ ఇస్తే.. నేను వివరణ ఇవ్వాలా.. డీసీసీ ప్రెసిడెంట్‌పై మాజీ సర్పంచ్ ఫైర్!

Beri Eshwar: నువ్వు నోటీస్ ఇస్తే.. నేను వివరణ ఇవ్వాలా.. డీసీసీ ప్రెసిడెంట్‌పై మాజీ సర్పంచ్ ఫైర్!
Advertisement

Beri Eshwar: స్వేచ్ఛ బ్యూరో: డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు భయపడేది లేదని మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ స్పష్టం చేశారు. పార్టీ విలువలు దిగజార్చే విధంగా బేరి ఈశ్వర్ వ్యవహరించారంటూ డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్ శనివారం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై బేరి ఈశ్వర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎక్కడా పార్టీ విలువలు దిగజార్చే విధంగా వ్యవహరించలేదని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు వచ్చాయని, తాను సూచన మాత్రమే చేశానని తెలిపారు. ఆ విషయాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసింది కూడా జంగయ్య యాదవ్ మోచేతి నీళ్లు తాగే వారేనని ఆరోపించారు. దానిని మాట్లాడుకుని సరిచేసుకోవాల్సింది పోయి తనకు నోటీసు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.

నోటీసు ఇచ్చే అధికారం..

తాను కూడా పార్టీలో సీనియర్ నాయకుడినేనని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉండి కూడా నాయకులతో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉందని, పార్టీకి విధివిధానాలు ఉన్నాయని, ఆ విషయం జిల్లా అధ్యక్షుడికి తెలియకపోవడం శోచనీయమన్నారు. జిల్లా అధ్యక్షుడికి షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం లేదని, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కేవలం పార్టీ క్రమశిక్షణ సంఘానికే ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి వద్దే తేల్చుకుంటానని బేరి ఈశ్వర్ స్పష్టం చేశారు.పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ప్రశాంతి రెడ్డి పీసీసీ సభ్యురాలిగా ఉండి, తన నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై డీసీసీ అధ్యక్షుడికి కాకుండా క్రమశిక్షణ సంఘం చైర్మన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయం కూడా జిల్లా అధ్యక్షుడికి తెలియకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

Advertisement

Also read: రూ.15వేల లోపు ది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు!

అధ్యక్షుడి పై ఆరోపణలు..

జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన నోటీసుకు తాను ఎలాంటి వివరణ ఇవ్వబోనని స్పష్టం చేశారు. తాను కూడా జిల్లా అధ్యక్షుడిపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జిల్లా అధ్యక్షుడిపై పలువురు ఆరోపణలు చేసినప్పటికీ వారికి నోటీసులు ఇవ్వకుండా, అణగారిన వర్గానికి చెందిన తనకే నోటీసు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చి తనకు ఆయుధం ఇచ్చినట్టేనని, జిల్లా అధ్యక్షుడిపై చర్యల కోసం పోరాటం చేస్తానని బేరి ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 299 డివిజన్ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, జిల్లా obc సెల్ అధ్యక్షుడు రవి ముదిరాజ్, గడిల కృష్ణ రెడ్డి, ఆదిలక్ష్మి, విజయ్,కావేరి శేఖర్, అమరం సురేష్ రెడ్డి, సంపత్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Kissik Talks: ఈటీవీకి మరోబిడ్డ.. ఆ సీరియల్ వల్లే బ్యాన్ చేసే పరిస్థితి.. నిజం బయటపెట్టిన సోనియా!

Related News

Kavitha EC: ఈసీ నోటీసులపై తిరగబడ్డ కవిత.. ఢిల్లీ లాయర్లతో న్యాయపోరాటానికి స్కెచ్!

పదవులు ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గెలుపే నా లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. జూలై 6, 7 తేదీల్లో ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

jangaon: కేటీఆర్ టూర్‌లో అపశ్రుతి.. కాన్వాయ్‌లో ఢీ కొన్న రెండు కార్లు, ఎమ్మెల్సీకి గాయాలు

కోట్ల విలువైన మత్తు… ఒక్క క్షణంలో బూడిద! సైబరాబాద్ పోలీసుల బిగ్ ఆపరేషన్

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కారు ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒక్కసారిగా మారిన వాతావరణం, తెలంగాణకు భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×