CMR Rice: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అభియోగంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. DCSO పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లి లోని ARS ఇండస్ట్రీస్ మిల్లులో అధికారులు తనికీలు చేశారు.
Also Read: 2-పిన్, 3-పిన్ ప్లగ్ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?
2022-23,2023-24,2024-25 మూడు సంవత్సరాల రబీ సీజన్ కు సంబంధించిన 9 వేల మెట్రిక్ టన్నుల CMR రైస్ ప్రభుత్వానికి అందించలేదని అధికారులు గుర్తించారు. ఈ CMR రైస్ విలువ దాదాపు 40 కోట్ల 96 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మిల్లు యజమాని అయిన మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై BNS 316(2), 316(5), 318(4), Essential Commodities Act సెక్షన్ 7 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: ‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!