BigTV English
Advertisement

Bhatti Vikramarka: త్వరలో రైతు రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: త్వరలో రైతు రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Comments On Farm Loan Waiver: త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 9 2023 లోపు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. ఐదేళ్లలో చేయలేదన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారని అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉందన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చామన్నారు. ఈ పథకంతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు కట్టిన ఎట్టిపరిస్థితుల్లో వృథా కాకూడదని ప్రతీ పైసా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామన్నారాయన.

ఇప్పటికే రైతు భరోసా మీద ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే అందులో ఎవ్వరి సొంత నిర్ణయాలు ఉండవని.. అన్ని జిల్లాల ప్రజలందరితో చర్చించిన తర్వాత నివేదికి తయారు చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ నివేదిక ప్రవేశపెట్టి దానిపై చర్చించిన తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణలో సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచాలన్నదే తమ కోరిక అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


Also Read: వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పనిచేస్తే కుదరదు: అధికారులకు సీఎం వార్నింగ్

ఇప్పటికే రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌‌గా వ్యవహరించనుండగా, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉండనున్నారు.

Tags

Related News

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600

Jubilee Hills By Elections: ఇంకా రెండు రోజులే టైం.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టెన్షన్ టెన్షన్..

Defecting MLAs: కొనసాగుతున్న రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..

Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×