సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారులు ఎంత అవగాహన కల్పించినా ఎక్కడో ఒకచోట బాధితులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ పేరును వాడుకుని సైబర్ స్కాం చేసేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగు చూసింది.
సైబర్ నేరగాళ్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఫోటోను ఒక కొత్త నంబర్ వాట్సాప్ ప్రొఫైల్గా పెట్టుకున్నారు. అనంతరం.. ఆ నంబర్ నుంచి తోటి అధికారులకు మెస్సేజ్లు పంపడం ప్రారంభించారు. అత్యవసరంగా డబ్బులు అవసరమని, వెంటనే పంపాలని కేటుగాళ్లు ఆ మెస్సేజ్లలో అడిగారు.
ఈ విషయం కలెక్టర్ రాహుల్ శర్మ దృష్టికి వచ్చింది. దీనిని సీరియస్గా తీసుకున్న కలెక్టర్.. తన పేరుతో వస్తున్న ఈ మోసపూరిత సందేశాలపై వెంటనే జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే విధంగా.. కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తన పేరుతో వస్తున్న ఈ మెస్సేజ్లను ఎవరూ స్పందించవద్దని డబ్బులు పంపవద్దని తోటి అధికారులు, ప్రజలను కోరారు. ఈ రకమైన మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ALSO READ: Atal Bihari Vajpayee statue: బహిరంగ సభ మధ్యలో అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే నక్కా