E-Paper
Advertisement

TS BJP News : మహాధర్నాతో బీజేపీ ‘డబుల్’ ధమాకా.. కమాన్ కాంగ్రెస్!

TS BJP News : మహాధర్నాతో బీజేపీ ‘డబుల్’ ధమాకా.. కమాన్ కాంగ్రెస్!
bjp news telnagana

BJP news Telangana: సరైన సమయంలో సరైన పాయింట్ పట్టుకుంది బీజేపీ. రేసులో వెనకపడిందని అనుకుంటున్న సమయంలో.. సడెన్‌గా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ఇష్యూతో రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయింది. కాంగ్రెస్‌కు ధీటుగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వానలో తడుస్తూ రోడ్డుపై బైఠాయించిన తీరు రక్తి కట్టింది. అదే టెంపోను కంటిన్యూ చేస్తూ.. మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చింది.

అయితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తామంటే పోలీసులు ఊరుకుంటారా? పర్మిషన్ లేదంటూ చెక్ పెట్టారు. అదేంటి శాంతియుత ధర్నాకూ అనుమతి ఇవ్వరా? అంటూ కమలనాథులు హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఏవో కారణాలు చూపించి ధర్నాకు అనుమతి నిరాకరించడమేంటని నిలదీసింది. వెయ్యి మందికే భద్రత ఇవ్వలేకపోతే.. కోటి మందికి ఎలా రక్షణ కల్పిస్తారని గట్టిగానే ప్రశ్నించింది.

మంగళవారం నాటి మహాధర్నాకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని పరిమితి విధించింది. ఎలాంటి ర్యాలీలు తీయొద్దని సూచించింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కమలదళంలో జోష్ పెరిగింది. మహాధర్నాతో బీజేపీ వాయిస్‌ బిగ్గరగా వినిపించేలా సన్నాహాలు చేస్తోంది.

ఓవైపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో 70వేల ఇండ్లు లబ్దిదారులకు అందజేయనుంది. అయితే, ఆ మైలేజ్ బీఆర్ఎస్‌కు రాకుండా బీజేపీ వెంటనే రంగంలోకి దిగింది. కేంద్రం ఇచ్చిన సొమ్ముతోనే ఆ ఇండ్లు కట్టారని చెబుతోంది. కేంద్రం ఇచ్చేది సగం డబ్బులే అని సర్కారు అంటోంది. ఏపీలో లక్షల్లో డబుల్ ఇండ్లు కడితే.. తెలంగాణలో వేలల్లో మాత్రమే నిర్మించారని తప్పుబడుతోంది. అరకొరగా కట్టి వదిలేసిన బాలసింగారం బాట పట్టి.. కిషన్‌రెడ్డి ఇష్యూని బీజేపీ వైపు డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మహాధర్నాతో మరింత జోరు పెంచారు.

అయితే, కమలనాథులు ఇంతగా రాజకీయం చేస్తున్నా.. ఎందుకో గానీ కాంగ్రెస్ ఈ విషయంలో వెనకబడింది. వాళ్లు టేకప్ చేసిన ఇష్యూలో తామెందుకు ఇన్వాల్వ్ కావాలనుకున్నారో ఏమో.. ప్రస్తుతానికైతే వేరే అంశాలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గతంలో మాదిరి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.. సొంత స్థలంలో కట్టుకునే వారికి డబ్బులు ఇస్తామని.. ఇప్పటికే హామీ ఇచ్చింది.

Related News

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

Big Stories

×