E-Paper
Advertisement

మెరిసిన దమ్మపేట విద్యార్ధులు.. బంగారు పథకాల పంట పండించిన ఓమేగా స్కూల్..!

మెరిసిన దమ్మపేట విద్యార్ధులు.. బంగారు పథకాల పంట పండించిన ఓమేగా స్కూల్..!
Advertisement

Best School: స్వేచ్ఛ బ్యూరో: 2025-26 విద్యా సంవత్సరానికి యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, అధిక సంఖ్యలో బంగారు పతకాలు సాధించినందుకు దమ్మపేట బోటనీ బాలాజీ ఓమేగా స్కూల్ ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న అనేక విద్యాసంస్థల మధ్య ఈ పాఠశాల తన ప్రతిభను చాటుకుని ఈ గౌరవాన్ని సొంతం చేసుకుంది. యూనిఫైడ్ కౌన్సిల్ ప్రతినిధులు ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.

అనంతరావు మాట్లాడుతూ..

ఈ అవార్డును అందుకున్న అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ అనంతరావు మాట్లాడుతూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు నిర్మాణంలో యూనిఫైడ్ కౌన్సిల్ అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో గొప్పదని కొనియాడారు. విద్యార్థుల్లో పోటీ భావనను పెంపొందించడం, వారి మేధస్సును మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో నిర్వహిస్తున్న ఒలింపియాడ్ పరీక్షలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాబోయే విద్యా సంవత్సరాల్లో మరిన్ని బంగారు పతకాలు సాధించి బోటనీ బాలాజీ ఓమేగా స్కూల్‌ను రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Also Read: ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

భవిష్యత్తులో..

ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినుల సమిష్టి కృషి, విద్యార్థుల కఠిన శ్రమ, తల్లిదండ్రుల సహకారం వల్లనే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో మరిన్ని ఆధునిక బోధనా విధానాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ అవార్డు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచడమే కాకుండా, విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు.

Advertisement

Also Read: కాంగ్రెస్‌లో కమల్‌హాసన్‌ను మించిన నటులు ఉన్నారు: కేటీఆర్‌

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×