Best School: స్వేచ్ఛ బ్యూరో: 2025-26 విద్యా సంవత్సరానికి యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, అధిక సంఖ్యలో బంగారు పతకాలు సాధించినందుకు దమ్మపేట బోటనీ బాలాజీ ఓమేగా స్కూల్ ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న అనేక విద్యాసంస్థల మధ్య ఈ పాఠశాల తన ప్రతిభను చాటుకుని ఈ గౌరవాన్ని సొంతం చేసుకుంది. యూనిఫైడ్ కౌన్సిల్ ప్రతినిధులు ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.
ఈ అవార్డును అందుకున్న అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ అనంతరావు మాట్లాడుతూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు నిర్మాణంలో యూనిఫైడ్ కౌన్సిల్ అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో గొప్పదని కొనియాడారు. విద్యార్థుల్లో పోటీ భావనను పెంపొందించడం, వారి మేధస్సును మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో నిర్వహిస్తున్న ఒలింపియాడ్ పరీక్షలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాబోయే విద్యా సంవత్సరాల్లో మరిన్ని బంగారు పతకాలు సాధించి బోటనీ బాలాజీ ఓమేగా స్కూల్ను రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Also Read: ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!
ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినుల సమిష్టి కృషి, విద్యార్థుల కఠిన శ్రమ, తల్లిదండ్రుల సహకారం వల్లనే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో మరిన్ని ఆధునిక బోధనా విధానాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ అవార్డు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచడమే కాకుండా, విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు.
Also Read: కాంగ్రెస్లో కమల్హాసన్ను మించిన నటులు ఉన్నారు: కేటీఆర్