E-Paper
Advertisement

KTR: ఈ పిల్లలకు రాహూల్ ఏమి చెప్తారు ? రాహూల్ కి ట్వీట్ ట్యాగ్ చేసిన కేటీఆర్

KTR: ఈ పిల్లలకు రాహూల్ ఏమి చెప్తారు ? రాహూల్ కి ట్వీట్ ట్యాగ్ చేసిన కేటీఆర్

KTR:ఇక్కడ పేదల గృహాలను కూల్చేస్తున్నారు. వారి కలలను చిదిమేస్తున్నారు. ఆ కూలిన ఇంటి శిథిలాలతో వారి జీవితాలను వెతుక్కుంటున్నారు అంటూ తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఏఐసీసీ అగ్ర నేత రాహూల్ గాంధీకి సైతం ట్యాగ్ చేశారు.

హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన కోసం అక్రమ కట్టడాలను తొలగిస్తుండగా.. అక్కడ కొందరు చిన్నారులు ఇంటి శిథిలాల వద్ద దీనంగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా శంకర్ నగర్, చాదర్‌ఘాట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇంటిని కూలగొడితే.. తమ చిట్టి చేతులతో అమాయకంగా ఒక్కొక్క రాయిని పేర్చుతూ పిల్లలు ఆడుకుంటున్నారు.

మూసీ సుందరీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి ఆక్రమణలను తొలగిస్తోంది. మూసీ ప్రక్షాళన ప్రభుత్వ ధ్యేయమంటూ.. అక్కడి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ గృహాలను మంజూరు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అక్కడి నిర్వాసితులు కూడా ప్రభుత్వానికి సహకరించే స్థితి ప్రస్తుతం ఉందని చెప్పవచ్చు. మంగళవారం నుండి అక్కడి ఆక్రమణలను ప్రభుత్వం తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇరువురు చిన్నారులు తమ ఇంటి శిథిలాల వద్ద ఆడుకుంటూ ఉండగా.. ఎవరో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Also Read: KTR: పేదల బ్రతుకులను కూల్చేస్తున్నారు.. రాహుల్ స్పందించాలి.. కేటీఆర్ ట్వీట్..

వారి గూడుని కూల్చేసారు.. వారి కలలను చిదిమేసారు.. ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు.. మంత్రులను వచ్చి చెప్పమనండి.. వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని, మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి.. మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము.. మీ బ్రతుకులు బాగుపడతాయని.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన అంటూ ట్వీట్ చేసి రాహూల్ గాంధీకి ట్యాగ్ చేశారు. కాగా ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు సైతం రాహూల్ గాంధీకి లేఖ రాశారు. వెంటనే కాంగ్రెస్ పెద్దలు స్పందించాలని, మీరు సాధించే తెలంగాణ అభివృద్ది ఇదేనా అంటూ హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. అయితే మూసీ ప్రక్షాళన కోసం కూల్చివేతలు సాగుతుండగా.. కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ విమర్శలను గుప్పిస్తోంది.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×