E-Paper
Advertisement

Hydra: శభాష్ హైడ్రా.. కూల్చివేతలపై అభినందించిన హైకోర్టు

Hydra: శభాష్ హైడ్రా.. కూల్చివేతలపై అభినందించిన హైకోర్టు
Advertisement

Hydra: హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను పురస్కరించుకుంటూ హైకోర్టు హైడ్రాపై ప్రశంసలు కురిపించింది. చెరువులను కాపాడడమే కాదు, వాటిని సుందరంగా తీర్చిదిద్దుతూ నగర వాతావరణాన్ని మార్చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టు అభినందన
మాధాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పరిధిలో టీడీఆర్ కేసు విచారణ సందర్భంగా.. న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రా పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తారు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా తీసుకొని పనిచేస్తోందని ఆయన అభినందించారు. చెత్త కుప్పలుగా మారిన ప్రాంతాలు ఇప్పుడు అందంగా మారాయి అని జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

బతుకమ్మకుంటకు ప్రత్యేక ప్రస్తావన
జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ముఖ్యంగా బతుకమ్మకుంట అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు ఆక్రమణలతో చెత్త కుప్పగా మారిన బతుకమ్మకుంట ఇప్పుడు సర్వాంగ సుందరంగా మారి, ప్రజలకు ఆహ్లాదాన్ని ఇస్తోంది అని వ్యాఖ్యానించారు. బతుకమ్మకుంట పునరుద్ధరణతో వర్షాకాలంలో ఆ ప్రాంతంలో వర్షపు నీటి ముప్పు తగ్గిందని, భూగర్భ జలాలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. ఇలాంటి పనితీరే నగర భవిష్యత్తుకు దారిని చూపిస్తుంది అని ఆయన చెప్పారు.

మరికొన్ని చెరువుల అభివృద్ధి కొనసాగుతోంది
హైడ్రా ఆధ్వర్యంలో ప్రస్తుతం నగరంలోని గచ్చిబౌలి మల్కం చెరువు, మాధాపూర్ తమ్మిడికుంట చెరువు, శంషాబాద్‌ సమీపంలోని కొంతమంది చెరువులు, అలాగే నగర పశ్చిమ ప్రాంతంలోని మరో ఐదు చెరువుల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Advertisement

టీడీఆర్‌పై సరైన విధానం అవసరం
హైకోర్టు తీర్పులో జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ప్రభుత్వం టీడీఆర్ విధానంపై.. సరైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ పరిధిలో ఉన్న భూములు, ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నియంత్రణలోకి రావడం సహజమని, కానీ ఆ ప్రాంతాల యజమానులకు సరైన పరిహారం ఇవ్వడం తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. స్పష్టమైన టీడీఆర్ విధానం ఉంటేనే చెరువుల అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయి. ఆ విధానం లేకపోతే లిటిగేషన్లు పెరిగి ప్రాజెక్టులు నిలిచిపోతాయి అని ఆయన సూచించారు.

Also Read: బాగా ముదిరిపోయారు.. ఫాంహౌస్‌లో మైనర్ల ట్రాప్‌హౌస్ పార్టీ..?

హైడ్రా చెరువుల పునరుద్ధరణలో చేస్తున్న పనులు నగర పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా.. ప్రజా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తున్నాయి. చెరువుల పునరుద్ధరణతో వర్షపు నీటి నిల్వ పెరుగుతూ, భూగర్భ జలాల స్థాయి మెరుగుపడుతోంది.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×