E-Paper
Advertisement

Narsimha Reddy-Malla Reddy: మరో వివాదంలో మల్లారెడ్డి

Narsimha Reddy-Malla Reddy: మరో వివాదంలో మల్లారెడ్డి
Advertisement

Narsimha Reddy-Malla Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆరోపించారు ఓ వ్యక్తి.  భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొని తనకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వట్లేదన్నది బాధితుడి ఆవేదన. ఇంతకీ ఆ బాధితుడు ఎవరు? ఎక్కడ? ఇంకా లోతుల్లో వెళ్దాం..

బాధితుడి పేరు కళ్లెం నర్సింహా‌రెడ్డి.. వయస్సు 87 ఏళ్లు. హైదరాబాద్‌లోని దోమల్‌గూడా ప్రాంతానికి చెందిన రైతు. దగ్గరి బంధువే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారని ఆరోపించాడు.

Advertisement

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండలం, యాడారం గ్రామంలో సర్వే నంబర్ 249, 250 ఏలో 23 ఎకరాల 26 గుంటల భూమిని 1982లో భూమిని కొనుగోలు చేశాడు ఆ రైతు. అయితే ఈ భూమిని తాను కొంటానంటూ బంధువుల ద్వారా పలుమార్లు మల్లారెడ్డి అడిగారని తెలిపాడు.

తొలుత మొత్తం భూమి కొనుగోలు చేస్తానని చెప్పిన మల్లారెడ్డి, చివరకు 9.29 ఎకరాలు కొనుగోలు చేస్తానని అన్నాడని తెలిపాడు. ఒక్కో ఎకరానికి రూ.2.25 కోట్లు చొప్పున 9.29 ఎకరాలకు మొత్తం రూ. 21.88 కోట్లకు డీల్ కుదిరింది. అందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా జరిగింది.

Advertisement

ALSO READ: గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్.. ఊచ‌లు లెక్క‌బెట్టిస్తానంటూ వార్నింగ్!

విడతల వారిగా రూ. 8.03 కోట్లు చెల్లించారట మల్లారెడ్డి. మిగతా 14 కోట్లు చెల్లించలేదని, అడిగితే తర్వాత ఇస్తానంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. కొడుకు మహేందర్‌రెడ్డి కంపెనీ సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఆ సమయంలో 14 కోట్లకు సంబంధించి చెక్కులు ఇచ్చారన్నాడు బాధితుడు. ఆ చెక్కులు చెల్లలేదన్నది బాధితుడి మాట. గత 40 రోజులుగా డబ్బు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తన గోడు కళ్లెం నర్సింహా‌రెడ్డి. దీనిపై మల్లారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×