BigTV English

Narsimha Reddy-Malla Reddy: మరో వివాదంలో మల్లారెడ్డి

Narsimha Reddy-Malla Reddy: మరో వివాదంలో మల్లారెడ్డి

Narsimha Reddy-Malla Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆరోపించారు ఓ వ్యక్తి.  భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొని తనకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వట్లేదన్నది బాధితుడి ఆవేదన. ఇంతకీ ఆ బాధితుడు ఎవరు? ఎక్కడ? ఇంకా లోతుల్లో వెళ్దాం..


బాధితుడి పేరు కళ్లెం నర్సింహా‌రెడ్డి.. వయస్సు 87 ఏళ్లు. హైదరాబాద్‌లోని దోమల్‌గూడా ప్రాంతానికి చెందిన రైతు. దగ్గరి బంధువే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారని ఆరోపించాడు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండలం, యాడారం గ్రామంలో సర్వే నంబర్ 249, 250 ఏలో 23 ఎకరాల 26 గుంటల భూమిని 1982లో భూమిని కొనుగోలు చేశాడు ఆ రైతు. అయితే ఈ భూమిని తాను కొంటానంటూ బంధువుల ద్వారా పలుమార్లు మల్లారెడ్డి అడిగారని తెలిపాడు.


తొలుత మొత్తం భూమి కొనుగోలు చేస్తానని చెప్పిన మల్లారెడ్డి, చివరకు 9.29 ఎకరాలు కొనుగోలు చేస్తానని అన్నాడని తెలిపాడు. ఒక్కో ఎకరానికి రూ.2.25 కోట్లు చొప్పున 9.29 ఎకరాలకు మొత్తం రూ. 21.88 కోట్లకు డీల్ కుదిరింది. అందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా జరిగింది.

ALSO READ: గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్.. ఊచ‌లు లెక్క‌బెట్టిస్తానంటూ వార్నింగ్!

విడతల వారిగా రూ. 8.03 కోట్లు చెల్లించారట మల్లారెడ్డి. మిగతా 14 కోట్లు చెల్లించలేదని, అడిగితే తర్వాత ఇస్తానంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. కొడుకు మహేందర్‌రెడ్డి కంపెనీ సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఆ సమయంలో 14 కోట్లకు సంబంధించి చెక్కులు ఇచ్చారన్నాడు బాధితుడు. ఆ చెక్కులు చెల్లలేదన్నది బాధితుడి మాట. గత 40 రోజులుగా డబ్బు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తన గోడు కళ్లెం నర్సింహా‌రెడ్డి. దీనిపై మల్లారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×