E-Paper
Advertisement

BRS Party Burden On KTR: కేటీఆర్ పైనే భారం చేతులెత్తేసిన కేసీఆర్?

BRS Party Burden On KTR: కేటీఆర్ పైనే భారం చేతులెత్తేసిన కేసీఆర్?
తెలంగాణలో కాళేశ్వరం కేంద్రంగా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఇరు పార్టీల మధ్య వాటర్ వార్ హైవోల్టేజ్‌కి చేరుకుంది. బీఆర్ఎస్ చలో మేడిగడ్డతో కాళేశ్వరం పంచాయితీ కాక రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నీటి ఎత్తిపోతలను ప్రారంభించాలన్నారు. ఆగస్టు 2 వరకు గడువిస్తున్నామని,  స్పందించకుంటే కేసీఆర్‌ నాయకత్వంలో 50 వేల మంది రైతులతో కలిసి మోటార్లను ప్రారంభిస్తామని హెచ్చరించారు కేటీఆర్.  కుంగుబాటు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. రాబోయే రోజుల్లో మేడిగడ్డకు కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉందని కామెంట్ చేశారాయన.
తమ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతల ఘోర తప్పిదమని.. ఏ సీఎం కూడా ఇలా చేసి ఉండరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరంపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు.
ఇక మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బీఆర్‌ఎస్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్‌‌నేనని..  కేటీఆర్‌ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. అయినా పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తీసిపారేశారు. కాళేశ్వరం పేరుతో రెండు లక్షల కోట్ల రూపాయలు గంగపాలు చేశారని ఆ డబ్బులతో వేలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టేవాళ్లం అని పేర్కొన్నారు.
ఆధారాలతో సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ సతమతమవుతుంది. ఇప్పుడు ఎంఐఎం కూడా వారికి తోడైంది. బీఆర్ఎస్ హయంలో పాతబస్తీ అభివృద్ధికి నోచుకోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శించారు. వాళ్ల దృష్టి మొత్తం గచ్చిబౌలి వైపే ఉందని మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో దుర్భర పరిస్థితులు ఉన్నా పట్టించుకున్న నాదుడే గత పదేళ్లలో లేడని. కేటీఆర్‌ను అడిగితే ఇదిగో అదిగో అని కాలం వెళ్లదీశారనిఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటలు అద్భుతంగా చెప్పేవారు కానీ.. పనులు మాత్రం శూన్యమని సెటైర్లు విసిరారు.
కాంగ్రెస్ నేతలకే కేటీఆర్ పళ్లబిగువున సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పవర్‌లో ఉన్నప్పుడు పాతబస్తీపై బోల్డు ప్రేమ ఒలకపోసిన ఆయన ఇప్పుడు అక్బర్ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ ఒంటరి అయిపోయిటన్లే కనిపిస్తోందిప్పుడు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×