E-Paper
Advertisement

Medigadda Barrage : మేడిగడ్డ బ్రిడ్జిని పరిశీలించిన కేంద్ర బృందం.. బీఆర్ఎస్ లో టెన్షన్

Medigadda Barrage : మేడిగడ్డ బ్రిడ్జిని పరిశీలించిన కేంద్ర బృందం.. బీఆర్ఎస్ లో టెన్షన్
Advertisement

Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో.. ఆ ప్రాంతాన్ని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటి.. శనివారం రాత్రి అసలేం జరిగిందో స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ పరిస్థితిని అంచనా వేసి కేంద్రానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. ఆరుగురు సభ్యుల బృందం.. బ్యారేజ్ డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఎక్కడెక్కడ పిల్లర్లు కుంగాయి? ఎక్కడెక్కడ పగుళ్లు వచ్చాయి? కుంగిన పిల్లర్లతో పాటు మిగతా పిల్లర్ల పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేస్తోంది. బ్యారేజ్‌ను నిర్మించిన సంస్థలతో చర్చించడంతో పాటు.. ఇరిగేషన్‌, ప్రభుత్వ అధికారులతోనూ సంప్రదింపులు జరపనుంది. ఆ తర్వాత బ్యారేజ్ పరిస్థితిపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇస్తుంది. కేంద్ర బృందంలో అనిల్‌జైన్, ఎస్‌.కె.శర్మ, తంగమణి, రాహుల్ కె.సింగ్, దేవేందర్‌ రావు ఉన్నారు.

మేడిగడ్డ బ్యారేజీని మొత్తం 7 బ్లాకులుగా నిర్మించారు. ఇది మహారాష్ట్ర వైపు చివరిలో ఉంది. దీనిలోని పిల్లర్లే ప్రస్తుతం కుంగిపోయాయి. కేంద్ర బృందం బ్యారేజీకి జరిగిన నష్టంపై అంచనా వేసి నివేదిక ఇచ్చాక.. ఆ బృందం సిఫార్సుల ఆధారంగా చర్యలు చేపడతారు. మరోవైపు బ్యారేజీ కుంగిపోవడంతో ఇప్పటికే నీటిని మొత్తం దిగువకు వదిలేసి.. అధికారులు ప్రాజెక్టును ఖాళీ చేశారు. ప్రస్తుతం వచ్చిన నీళ్లు వచ్చినట్లే దిగువకు వెళ్లిపోతున్నాయి.

Advertisement

ఇక బ్యారేజ్ దగ్గర అధికారులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. విపక్ష పార్టీలు బ్యారేజ్ సందర్శనకు వస్తుండటంతో.. ఆ ప్రాంతానికి ఎవరూ రాకుండా, 144 సెక్షన్ అమల్లో ఉందని చెబుతున్నారు. ఎవరైనా వచ్చినా బ్యారేజ్ దగ్గరికి అనుమతించకుండా.. బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నారు. దాంతో.. విపక్ష పార్టీలు అధికార బీఆర్‌ఎస్‌పై భగ్గుమంటున్నాయి. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో.. ప్రజాధనమంతా వృథా అయిందని, దీనికి కారణం సీఎం కేసీఆరే కాబట్టి.. మేడిగడ్డ కుంగుబాటుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×