E-Paper
Advertisement

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగేదిలేదు.. మూసీ బాధితుల‌కు రేవంత్ మ‌రో భ‌రోసా

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగేదిలేదు.. మూసీ బాధితుల‌కు రేవంత్ మ‌రో భ‌రోసా
Advertisement

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా మూసీ రివర్‌(Musi River) ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కూడా యువ ఇంజనీర్ల చేతుల మీదుగా జరుగుతుందన్నారు. మూసీకి పట్టిన మకిలిని వదిలిస్తామని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు అన్ని విధాల ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Advertisement

ఇవాళ మూసీ నది అంటే ఓ మురికి కూపంగా జనం చూస్తున్నారని.. ఇకపై అలా ఉండదని ముఖ్యమంత్రి అన్నారు. ఇంట్లో ఆడపిల్లలకు మూసీ పేరు ఎందుకు పెట్టకూడదని రేవంత్ ప్రశ్నించారు. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు.. మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా సుందరీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత గరంగా ఉన్నారో.. పదవీ విరమణ చేసేవరకు అలాగే ఉండాలని ఉద్యోగులకు సీఎం సూచించారు. ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటామా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లతో ఎవరి భూములు పోలేదా అని సీఎం నిలదీశారు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. అనవసర విషయాలను పక్కన పెట్టి మూసీ నిర్వాసితులను ఏవిధంగా ఆదుకుందామో సలహాలివ్వండి అంటూ విపక్షాలకు సూచించారు.

Advertisement

Also Read: అమ్మాయి అందంతో ఎర.. పబ్‌లో గలీజ్ పనులు

కేసీఆర్ పదేళ్లు తన కుటుంబానికి ఉపాధి కల్పించుకున్నారే తప్పా.. నిరుద్యోగులకు గాలికి వదిలేశారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కేసీఆర్ ముసుగు తొలగిపోయిందని.. ఇక ఆయన్ని ఎవరూ నమ్మరని తేల్చేశారు. మూసీ ప్రక్షాళనే తన ధ్యేయమని చెప్పారాయన. కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొద్దాం రావాలని ఈటలకు సవాల్ విసిరారు.కేసీఆర్‌కు కొంతకాలం తెలంగాణ ఉద్యమమనే ముసుగు, రక్షణ కవచం ఉన్నాయన్నారు. ఇవాళ ఆ ముసుగు తొలగిపోవడంతో ముఖం చెల్లక ఎక్కడో ఉన్నారని కౌంటర్‌ విసిరారు.

హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్ అయిపోయిందని.. గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా మూసి నిర్వాసితులకు ఒక మంచి జీవితాన్ని ఇద్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసింది. మరో 10 వేల కోట్లు ఖర్చు చేసి.. మూసీ బాధితులను ఆదుకోలేమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×