E-Paper
Advertisement

CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

తెలంగాణ రాజకీయాలు, సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సీఎం పూర్తిగా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిణామాల వల్ల 2028లో అసెంబ్లీ ఎన్నికలు రావడం అసాధ్యమని చెప్పారు. పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే 2029లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. ఈ కేసు దర్యాప్తు కోసం తొమ్మిది మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ వ్యవహారంలో పట్టుబడటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన స్టేషన్ బెయిల్ పై ఉన్నారని గుర్తుచేశారు. ఈ కేసులో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా మార్చడమే తమ ప్రథమ లక్ష్యమని సీఎం ప్రకటించారు. డ్రగ్స్ రవాణా, వినియోగం విషయంలో ఎంతటి ప్రభావిత వ్యక్తులనైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వ్యవస్థ ప్రక్షాళన కోసం తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో ముందుకు సాగుతోందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కవిత బుధవారం రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. నిబంధనల మేరకు కోర్టు రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఇటీవల ఈ కేసులో ఆమెకు ఊరట లభించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం హాజరయ్యారు. ఒకవైపు ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు, మరోవైపు న్యాయస్థానంలో కవిత హాజరు కావడం జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంచాయి.

Advertisement

తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణపై రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డ్రగ్స్ పార్టీల సంస్కృతిని పూర్తిగా అంతం చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహాలు, పాలనాపరమైన సంస్కరణలతో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ALSO READ: Delhi: ఢిల్లీలో పలకరింపులు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా, హస్తినలో ఏం పని?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×