HCU Issue: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించి.. కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కంచె గచ్చిబౌలి భూమి సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని… నిర్ణయం తీసుకున్నారు.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
ఈ మంత్రుల కమిటీలో… తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ , విద్యార్థుల ప్రతినిధి బృందంతో సంప్రదింపులకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు… స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Telangana Government has decided to constitute a committee with group of ministers,
1. Shri. Bhatti Vikramarka garu
2.Shri. Sridhar Babu Garu and
3.Shri. Ponguleti Srinivas Reddy garu
to consult with –
a. Hyderabad Central…— Revanth Reddy (@revanth_anumula) April 3, 2025