E-Paper
Advertisement

CM Revanth Reddy: అక్క‌డ రాత్రంతా వ్యాపారాలు.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త!

CM Revanth Reddy: అక్క‌డ రాత్రంతా వ్యాపారాలు.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త!
Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం కాలం నాటి వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, ఆధునిక వసతులతో నగరాన్ని ప్రపంచ పటంలో నిలుపుతామని హామీ ఇచ్చారు. బూమ్ రుకున్ ఉద్ దౌల చెరువు వంటి చారిత్రక కట్టడాలను నిజాం మనకు ఇచ్చిన ఆస్తిగా అభివర్ణించారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని, నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

నగర ప్రాధాన్యతను వివరిస్తూ.. “ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నగర అభివృద్ధిలో ఎంఐఎం (MIM) పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని, రాబోయే రోజుల్లో దక్షిణ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఆక్రమణకు గురైన చెరువులు, పార్కులు, నాలాలను కాపాడి, వాటిని పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని స్పష్టం చేశారు. అంబర్‌పేటలో కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి పునరుద్ధరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

చెరువుల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. ప్రతి చెరువు వద్ద లేక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే చెరువుల పరిసరాల్లో లేక్ ఎకానమీని సృష్టించనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల మహిళా సంఘాలకు ఉపాధి దొరుకుతుందని, అభివృద్ధి చేసిన చెరువుల వద్ద మహిళలు వ్యాపారాలు చేసుకోవచ్చని సూచించారు. మూసీ నదిని కూడా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, అక్కడ రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని చెప్పారు. నిరుద్యోగులు, వ్యాపారవేత్తలకు మూసీ ఒడ్డున మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు.

హైడ్రా (HYDRAA) పనితీరుపై స్పందిస్తూ.. ప్రారంభంలో కూల్చివేతల సమయంలో చాలామంది విమర్శించారని, కానీ ఇప్పుడు చెరువులు కబ్జా కోరల నుంచి విముక్తి చెందుతుంటే ప్రజలంతా సంతోషిస్తున్నారని సీఎం అన్నారు. మూసీ పరిసరాల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం అన్యాయం చేయదని, వారికి ప్రత్యామ్నాయ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. రంజాన్ పండుగ వేళ పాతబస్తీ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు విడుదల చేస్తామని, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Read Also: GHMC WhatsApp number: మీ వీధిలో చెత్త ఉందా? ఫొటో తీసి వాట్సాప్ చేయండి: జీహెచ్‌ఎంసీ కొత్త సేవలు

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×