Rain Alert: వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముందస్తుగా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా ఉండటానికి అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
Also Read: వివాదానికి తెరలేపిన బీజేపీ కల్లాల యాత్ర.. అసలు చిట్టా మర్చిపోయారా..!
ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని అన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కల్లాలలో ఉన్న దాన్యంపై ప్రత్యేక శ్రద్ద వహించి దాన్యం తడవకుండా అన్నీ రకాల చర్యలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సీఎం తెలిపారు. వాతావరణ శాఖ తెలిపిన హెచ్చరికలను ఎప్పటికప్పుడు గ్రహిస్తూ రైతులకు కావలసిన సహయ సలహాలు అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఎబోలా వైరస్ పై తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్.. అలర్ట్ అయిన ప్రభుత్వం!