E-Paper
Advertisement

రెండు కూటముల మధ్యే పోరు.. కేసీఆర్, బీజేపీ ఒక్కటే.. సీఎం రేవంత్ సంచలనం

రెండు కూటముల మధ్యే పోరు.. కేసీఆర్, బీజేపీ ఒక్కటే.. సీఎం రేవంత్ సంచలనం
Advertisement

రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు రెండు ప్రధాన కూటముల మధ్యే సాగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కోదండరాం ఒక కూటమిగా ఉంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మరో కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.

కాళేశ్వరం విచారణ – కేంద్రానికి సవాల్

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సీబీఐ విచారణ జరపాలని కిషన్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారని రేవంత్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించిందని చెప్పారు. కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణను అడ్డుకోవడానికే హరీష్ రావు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో ఇప్పటికే విజిలెన్స్ నివేదికలు ప్రాథమిక లోపాలను ఎత్తిచూపాయని పేర్కొన్నారు. కేంద్రం రాజకీయాలకు తలొగ్గి విచారణను అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తానే స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తానని స్పష్టం చేశారు.

హైడ్రా చర్యలు – కోర్టు తీర్పులు

Advertisement

ప్రభుత్వ భూములను కాపాడేందుకే హైడ్రా పనిచేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అక్రమ భూములను సొంతం చేసుకున్న వారు హైడ్రాను తప్పు పడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లపై వేసిన ఘోష్ కమిషన్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ కోర్టుకు వెళ్లడంపై ఆయన స్పందించారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం కాదని కోర్టు తేల్చిందని గుర్తు చేశారు. కేవలం సెక్షన్ 8(బి) ప్రకారం నేచురల్ జస్టిస్ పాటించలేదనే చిన్న ఉపశమనం మాత్రమే వారికి దక్కిందని వివరించారు. దీనిని విజయంగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోందని ప్రభాకర్ రావు అందుబాటులోకి రావడంతో మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రం ముందున్న సవాళ్లు

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల విభజన, జమిలి ఎన్నికల వంటి అంశాలపై కేంద్రం తీరును రేవంత్ తప్పుబట్టారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో లింక్ చేయడం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పార్లమెంట్ సీట్ల పెంపు విషయంలో కేంద్ర విధానం సరిగ్గా లేదని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రానికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ తన శిఖండి రాజకీయాలను మానుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.

ALSO READ: తెలంగాణ పర్యాటక శాఖ సంచలన నిర్ణయం.. ఆ పది జిల్లాలపై స్ఫెషల్ ఫోకస్!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×