E-Paper
Advertisement

CM Revanth Reddy: విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ ఫోకస్.. కీలక మార్పులు

CM Revanth Reddy: విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ ఫోకస్.. కీలక మార్పులు
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లు, ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి అందజేసింది.

శనివారం ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు విద్యా కమిషన్ ఛైర్మన్, సభ్యులు. విద్యా వ్యవస్థ బలోపేతంపై కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. కీలక విషయాల గురించి చర్చించారు కమిషన్ సభ్యులు. ముఖ్యంగా ప్రీప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతో పాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించారు.

Advertisement

కమిషన్ ప్రస్తావించిన అంశాలపై లోతుగా సమీక్ష చేశారు సీఎం. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కమిషన్ సభ్యులు ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠశాల నిర్వహణ సమస్యల గురించి ప్రస్తావించారు.

విద్యా విషయాల్లో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతోపాటు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నియోజకవర్గాల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, సమగ్ర విధానాలను రూపొందించాలని కమిషన్‌కు సూచించారు.

Advertisement

ALSO READ: ఒక్కమాటతో సలీమా జీవితాన్ని కాపాడిన సీఎం రేవంత్

అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×