E-Paper
Advertisement

CM Revanth Reddy: విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ ఫోకస్.. కీలక మార్పులు

CM Revanth Reddy: విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ ఫోకస్.. కీలక మార్పులు
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లు, ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి అందజేసింది.

శనివారం ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు విద్యా కమిషన్ ఛైర్మన్, సభ్యులు. విద్యా వ్యవస్థ బలోపేతంపై కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. కీలక విషయాల గురించి చర్చించారు కమిషన్ సభ్యులు. ముఖ్యంగా ప్రీప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతో పాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించారు.

Advertisement

కమిషన్ ప్రస్తావించిన అంశాలపై లోతుగా సమీక్ష చేశారు సీఎం. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కమిషన్ సభ్యులు ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠశాల నిర్వహణ సమస్యల గురించి ప్రస్తావించారు.

విద్యా విషయాల్లో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతోపాటు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నియోజకవర్గాల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, సమగ్ర విధానాలను రూపొందించాలని కమిషన్‌కు సూచించారు.

Advertisement

ALSO READ: ఒక్కమాటతో సలీమా జీవితాన్ని కాపాడిన సీఎం రేవంత్

అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

 

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×