CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆయన మంత్రులు, ముఖ్య నేతలతో జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ సమిష్టి గా అందరం పని చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. కచ్చితంగా అన్ని స్థానాలు గెలవాల్సిందేనని సూచించారు. పాత ,కొత్త నేతల సమన్వయంతో పనిచేయాలన్నారు.
గెలుపు బాధ్యత ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి లదేనని వివరించారు. ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రులు, ఇతర ముఖ్యనాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సమస్యలను ఎప్పటికప్పుడు పీసీసీ చీఫ్, వార్ రూమ్ దృష్టికి తీసుకురావాలన్నారు. మంత్రులందరూ జిల్లాలకు తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని చెప్పారు. ఇక సర్వే లలో వెనకబడిన మున్సిపాలిటీ లను విశ్లేషించిన సీఎం ఆయ ప్రాంతాల్లో ఫోకస్ పెట్టాన్నారు. ఎప్పటికప్పుడు ఇంచార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తనకు రోజు వారిగా రిపోర్ట్ అందజేయాలని ఇన్ చార్జ్ మంత్రులకు ఆదేశాలిచ్చారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలని సీఎం సూచించారు.
Also Read: CM Revanth Reddy: నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్.. ఆ విషయాలపై క్లారిటీ!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం సీఎం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
మీటింగ్ అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ లతో కలిసి మంత్రులతో మీటింగ్ నిర్వహించామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలపై చర్చించామన్నారు. కచ్చితంగా 90 శాతం స్థానాలు గెలుస్తున్నామన్నారు. కాంగ్రెస్ కు పోటీ లేదని, మెజార్టీ స్థానాలు తమవేనని పీసీసీ చీఫ్ చెప్పారు. రెబల్స్ ను విత్ డ్రా చేయిస్తున్నామన్నారు. జగిత్యాల విషయంలో పరిశీలిస్తున్నామని, సమస్య ను పరిష్కరిస్తామన్నారు. ఇక డిప్యూటీ సీఎం, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లు జిల్లాల్లో ఉండి రాలేకపోయారన్నారు. వారితో ఫోన్ లో మాట్లాడామన్నారు. గద్వాల ఇష్యూను కూడా పరిష్కరింపజేస్తామన్నారు.
ప్రతి మునిసిపాలిటీ కి, కార్పొరేషన్ కు పీసీసీ పరిశీలకులను నియమించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు లేని నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లకు బాధ్యతలు కల్పిస్తూ పార్టీ ఉత్తర్వులురిలీజ్ చేయనున్నది.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్కు మరో అరుదైన ఆహ్వానం.. ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలంటూ లేఖ