E-Paper
Advertisement

CM Revanth Reddy: శత్రువు చేతిలో డీకే అరుణ కత్తిలా మారారు.. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: శత్రువు చేతిలో డీకే అరుణ కత్తిలా మారారు.. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి..
Advertisement

CM Revanth Reddy Speech In Kodangal(Telangana congress news): శత్రువు చేతిలో డీకే అరుణ కత్తిలా మారారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానన్నారు. 33 వేల ఓట్ల మెజార్టీతో తనని గెలిపించారని తాను నామినేషన్ వేశాక ఒక్కసారి కూడా కొడంగల్ రాలేదని తెలిపారు. అయినా కొడంగల్ ప్రజలు తనని గుండెల్లో పెట్టుకుని చూశారని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో పేర్కొన్నారు.

కేసీఆర్‌లా తాను ఫామ్ హౌస్‌కు పరిమితమవ్వలేదని రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాలేదని కానీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి 5 సార్లు వచ్చానని అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. 70 ఏళ్లలో పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగందన్నారు. కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్‌లో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు.

Advertisement

అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కొడంగల్‌కు 5 వేల కోట్ల రూపాయల నిధుల తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 4 వేల కోట్ల రూపాయలతో మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చామని.. దీంతో లక్షా 30 వేల ఎకరాలకు నీటిని ఇస్తామని అన్నారు. కృష్ణా జలాలను అడ్డుకున్నది డీకే అరుణ అని ఫైర్ అయ్యారు. పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంది డీకే అరుణ అని అన్నారు. తనకు డీకే అరుణపై కోపం లేదని తెలిపారు. శత్రువు చేతిలో సురకత్తివై డీకే అరుణ పాలమూరు కడుపును పొడుస్తున్నారని మండిపడ్డారు.

Also Read: రేవంత్ సర్కార్‌పై రాములమ్మ మాట

Advertisement

పదేళ్లు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదని సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణపై విమర్శల వర్షం గుప్పించారు. పాలమూరు మీద సవతి ప్రేమ చూపించిన కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కమీషన్ల కోసం వాడుకున్నారని ఫైర్ అయ్యారు. ఐదేళ్లు తనకు అండగా ఉండండి వందేళ్ల అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశామని.. పంద్రాగస్టులోపు రైతురుణ మాఫీ చేస్తామని తెలిపారు. తాను బాధ్యత తీసుకున్న రోజు రూ. 3900 కోట్ల లోటు బడ్జెట్ ఉందని 5 నెలల్లో రూ. 26 వేల కోట్లు అప్పు కట్టానని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంటే ఆదుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు సవాల్ విసిరారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×