E-Paper
Advertisement

CM Revanth Reddy: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

నల్గొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరందించడమే కాదు.. 107 గ్రామాలకు తాగునీరందించే ఈ ప్రాజెక్ట్‌కి.. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. 2 మోటార్ల ద్వారా రిజర్వాయర్‌లో 70 శాతం నీటిని నింపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్‌ని ప్రారంభించడంతో పాటు రిజర్వాయర్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా 500 కోట్ల వ్యయంతో కాలువ పనులు, మిగిలిన పెండింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు.. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Advertisement

Also Read: మహేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. మరో 15 ఏళ్లు మాదేనంటూ

నల్గొండ శివారులోని పానగల్‌లో ఉన్న ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి.. 0.3 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న బ్రాహ్మణవెల్లెం రిజర్వాయర్‌లో నీటిని నింపుతారు. పానగల్ నుంచి 7 కిలోమీటర్ల ఓపెన్ కాలువ, కట్టంగూరు మండలంలోని పిట్టంపల్లి దగ్గరున్న సొరంగ మార్గం నుంచి నీటిని తరలిస్తారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ నుంచి కుడి, ఎడమ కాలువలు తవ్వి.. నల్గొండ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో.. లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. సుమారు 7 వందల కోట్ల అంచనా వ్యయంలో.. దాదాపు 484 కోట్లు ప్రాజెక్ట్ నిర్మాణానికి, మిగిలిన మొత్తాన్ని భూసేకరణకు కేటాయించారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×