BigTV English
Advertisement

Mahabodhi Buddha Vihar : ప్రతి పనిని ధ్యానంగా చేయండి.. మహాబోధి బుద్ధ విహార్ ను సందర్శించిన సీఎం రేవంత్

Mahabodhi Buddha Vihar : ప్రతి పనిని ధ్యానంగా చేయండి.. మహాబోధి బుద్ధ విహార్ ను సందర్శించిన సీఎం రేవంత్

Cm Revanth Reddy Visited Mahabodhi Buddha Vihar : ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. చేసే ప్రతి పనిని ధ్యానంగా పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఆయన సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరమని రేవంత్ వ్యాఖ్యానించారు. మహాబోధి బుద్ధ విహార్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని.. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్‌ ముగిశాక నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.


మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించాక.. గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందన్నారు. రాజ్యం, అధికారం రెండూ ఉండి.. వాటిని కాదని 29 సంవత్సరాల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించాడని, ఆయనే అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందంటే.. అది గౌతమ బుద్ధుడు చేసిన కృషి అని కొనియాడారు. తాను ఏ పనినైనా ఎంతో ధ్యానంగా చేస్తానని తెలిపారు.

Also Read : తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం రేవంత్, ఏపీ సీఎంను కలుస్తా..


సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఒక ధ్యాన పాఠశాలను నిర్వహించాలని కోరారు. సమాజంలో స్ఫర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం ఉందన్నారు. దేశం ఇప్పుడున్న పరిస్థితిలో బుద్ధుని సందేశం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ బుద్ధుడి సందేశాన్ని చేరవేసేందుకు అవసరమైన సహాయం.. ఒక వ్యక్తిగా, ఒక ప్రభుత్వం నుంచి చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలదని, అన్ని సహాయ, సహకారాలుంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో బుద్ధ భిక్షులను ఎల్లప్పుడూ గౌరవిస్తామన్నారు.

 

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×