BigTV English
Advertisement

CM Revanth Reddy: వానలు కొడుతున్న వేళ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ.. అందులో ఏం ప్రస్తావించారంటే..?

CM Revanth Reddy: వానలు కొడుతున్న వేళ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ.. అందులో ఏం ప్రస్తావించారంటే..?

CM Revanth Reddy Writes to PM Modi: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానిని కోరారు. అదేవిధంగా వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలంటూ ఆ లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి తక్షణ సాయాన్ని వెంటనే అందజేయాలంటూ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Also Read: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే

ఇదిలా ఉంటే.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహించిన సమీక్షలో పలువురు అధికారులకు ఆయన పలు ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య లేకుండా కమిషనర్లు చూడాలని ఆదేశించారు. అదేవిధంగా వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.


Also Read: తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలు బంద్..ప్రయాణాలు మానుకోవాలని విజ్ణప్తి

సమీక్ష అనంతరం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం గుండా బయలుదేరివెళ్లారు. మార్గమధ్యలో కోదాడలో ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. రాత్రి ఖమ్మంలో బస చేయనున్నారు. మంగళవారం తెల్లవారుజామున మహబూబాబాద్ చేరుకుని అక్కడ కూడా ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు.

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×