E-Paper
Advertisement

IAS Amoy Kumar: ఐఏఎస్ అధికారి అమోయ్ ‘భూ’లీలలు, మూడు జిల్లాలకు విస్తరణ.. డొంక కదులుతోందా?

IAS Amoy Kumar: ఐఏఎస్ అధికారి అమోయ్ ‘భూ’లీలలు, మూడు జిల్లాలకు విస్తరణ.. డొంక కదులుతోందా?

IAS Amoy Kumar: తెలంగాణ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ భూ ఆక్రమణల కేసు వ్యవహారం ఎంత వరకు వచ్చింది? కలెక్టర్ నుంచి తహశీల్దార్ స్థాయి అధికారులు ఈడీ ముందు హాజరయ్యారు. ఇంతకీ భూముల వ్యవహార మేంటి? తెలంగాణను దశాబ్దం పాటు పాలించింది కారు పార్టీ. మా పాలన బేష్ అంటూ ఊదర గొడుతున్నారు నేతలు. అప్పటి ప్రభుత్వంలోని లోపాలు ఒకొక్కటిగా బట్టబయలవుతున్నాయి.

తెలంగాణలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన అధికారి ఐఏఎస్ అమోయ్‌కుమార్‌. ఆయన భూలీలలకు ఏకంగా ఈడీ రంగంలోకి దిగిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్, ఆర్డీఓ, తహశీల్దార్ ఇలా అందరూ కట్టకట్టుకుని ఈడీ ముందు వాలిపోయారు.

లేటెస్ట్‌గా మూడు జిల్లాల నుంచి సీఎంవోకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండ దండలతో యథేచ్ఛగా భూ బదలాయింపులకు ఆయన పాల్పడినట్టు తెలుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పెద్దఎత్తున ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం చేశారన్నది అందులోని అసలు సారాంశం.

దీంతో మూడు జిల్లాల భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. కలెక్టర్‌గా అమోయ్‌కుమార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ బయటకు తీయాలని సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. తనువు చాలించిన యువకుడు.. ఎక్కడ జరిగిందంటే?

ధరణికి ముందు ఆ తర్వాత ఉన్న ల్యాండ్ వివరాలను పోల్చి చూడాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ధరణిలోని  లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రైమ్ ఏరియాలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను తక్కువ ధరకి ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ.

భూముల వ్యవహారంపై రెవిన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగేశారు. వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ధరణికి ముందు ఆ తర్వాత భూముల్లో చాలా వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తోంది.

2014 ముందు ప్రభుత్వ భూములు ఎంతమేరకు ఉన్నాయో తెలియని పరిస్థితి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద సుమారు 35 వేల ఎకరాల భూముల వివరాలు ధరణిలో నమోదు కాలేదు. వాటితోపాటు అసైన్డ్ భూముల వివరాలను అధికారులు పైకి తీస్తున్నారు.

కొద్దిరోజుల కిందట ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యత ఎన్ఐసీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గత ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాల వెలికి తీత మరింత సులభమని అవుతుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిక కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×