E-Paper
Advertisement

Committee on Dharani Portal : ధరణి కమిటీ భేటీ.. ఆ సమస్యలపై చర్చ..!

Committee on Dharani Portal : ధరణి కమిటీ భేటీ..  ఆ సమస్యలపై చర్చ..!
Advertisement
breaking news in telangana

Committee on Dharani Portal(Breaking news in telangana):

ధరణి(Dharani Portal)పై ఏర్పాటైన కమిటీ రెండోసారి భేటీ ముగిసింది. రెండో సారి భేటిలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 11న తొలిసారి ఈ కమిటీ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కోర్టు కేసులకు ఎలాంటి సమస్యలు వెళ్తున్నాయనే దానిపైనా కమిటీ సమావేశంలో చర్చించారు. ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్‌ చేశారు. దానికి కొనసాగింపుగా కమిటీ ఇవాళ మళ్లీ భేటీ అయ్యింది.

ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందుల పరిష్కారం చూపడంపై కమిటీ దృష్టి సారించింది. ఎంతకీ తెగని భూముల పంచాయితీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా త్వరలోనే కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది. ధరణి సాఫ్ట్ వేర్ ఏమిటి? ధరణిలో ఇప్పటి వరకు జరిగిన మార్పులు, చేర్పులపైనా కమిటీ సమగ్రంగా రిపోర్ట్​ తెప్పించుకొని ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.

Advertisement

అవసరమైతే ఫీల్డ్​ విజిట్​ చేసి ప్రాబ్లమ్స్​ తెలుసుకోవాలని కమిటీ ఆలోచనలో ఉంది. ధరణి కమిటీ కన్వీనర్‌గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఉన్నారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్, భూ చట్టాల నిపుణుడు సునీల్‌, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మధుసూదన్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరు ధరణి పోర్టల్ ఉన్న సమస్యలపై వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×