BigTV English

Madhusudhan reddy on Ktr: కేటీఆర్‌కు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కౌంటర్.. ఈ మాట ఆనాడేమైంది?

Madhusudhan reddy on Ktr: కేటీఆర్‌కు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కౌంటర్.. ఈ మాట ఆనాడేమైంది?

Madhusudhan reddy on Ktr: మాజీ మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ తర్వాత కేటీఆర్ మీడియా ముందుకొచ్చి ఏసీబీ-ఈడీ ఒకే ప్రశ్నలు అడుగుతున్నారంటూ చెప్పడంపై మండిపడ్డారు సదరు ఎమ్మెల్యే.


లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని కేటీఆర్‌ తరచు అంటున్నారని, ఆయనకు చేయాల్సింది నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు‌గా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించాలంటే కేటీఆర్ ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన తప్పులు బయటకు వస్తున్నాయని తెలిసి, ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

కేటిఆర్‌పై డిసెంబర్ 19న ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని, 20న కేసు నమోదు చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే. మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రజలు మిమ్ముల్ని బయట తిరగనివ్వరని అన్నారు. అధికారం పోయిన తర్వాత అవినీతి బయటకు వస్తుందన్న భయంతో అడ్డగోలుగా కేటీఆర్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు.


ముఖ్యమంత్రి పదవిపై కనీస గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూధన్‌రెడ్డి. లొట్టపీసు కేసు అన్న కేటీఆర్,  విచారణ మొదలు కాగానే ఎందుకు హడావిడి చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. విచారణ ఎదుర్కొన్న వ్యక్తి లోపల ఏమీ జరగలేదని ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ రుసరుసలాడారు.

ALSO READ: కొత్త రేషన్ కార్డులు.. ఆపై మంత్రి పొన్నం క్లారిటీ

సీఎం రేవంత్ రెడ్డిని అబాసుపాలు చేయాలన్నదే కేటీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. చేసిన తప్పులు ఒకొక్కటిగా బయటకు వస్తుండటంతో ఏం చేయాలో తెలియక కేటీఆర్  ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. నేరం ఒకటే కాబట్టి ఏసీబీ, ఈడీ ఒకేలా ప్రశ్నిస్తున్నాయని, దాన్ని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

విచారణను తప్పుదోవ పట్టించడం, హాజరుకాకుండా తప్పించుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే తప్పు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. కేటీఆర్ వ్యవహారాలు తెలిసే మాజీ సీఎం కేసీఆర్ బయటకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని చెప్పుకొచ్చారు.

కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేస్ కేసు, కవిత‌పై లిక్కర్ కేసులు ఉన్నాయన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా కుంభకోణాల్లో మునిగిపోయిందన్నారు. గ్రీన్ కో సంస్థను కాపాడే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ సంస్థ‌తో సంబంధాలు లేకుంటే అక్రమంగా సొమ్ము ఎందుకు బదలాయించారో కేటీఆర్ స్పష్టం చేయాలన్నారు. ఆనాడు మాపై ఎన్ని కేసులు పెట్టినా ఏనాడు భయపడలేదని, అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు.

Related News

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

×