Uttam Kumar Reddy: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో వివిధ జిల్లాలో తిరుగుతున్న ఎక్కడ అయినా కాంగ్రెస్ గాలి విస్తుంది. నిజామాబాదు కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీకి ఇంచార్జి గా ఉన్న రాజకీయ అనుభవంతో చెపుతున్న కాంగ్రెస్ వే ఉందన్నారు. రాష్టంలో కాంగ్రెస్ క్లిన్ స్విప్ చేయబోతుందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో మంచి పాజిటివ్ స్పందన ఉంది. పదేళ్లలో లేని స్వేచ ప్రజల్లో ఇప్పుడు వచ్చింది అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. సన్నబియ్యం పథకం గేమ్ చెంజర్ కాబోతుంది. దేశ వ్యాప్తంగా కానీ గత ప్రభుత్వం అయంలో కానీ అప్పుడు ఇచ్చే రేషన్ ప్రజలు తినే వారు కాదని మంత్రి ఉత్తం అన్నారు.
రాష్ట్రంలో ఆలా వచ్చిన రేషన్ బియ్యం రి సైకిలింగ్ అక్రమలకు గురయ్యేదని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి బట్టి విక్రమార్క మేము సమహాలోచన చేసి సన్న ధాన్యంకి ప్రోత్సహం ఇచ్చి 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చే వరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు ప్రజలు సన్నబియ్యం కొనుక్కొని తినేవారు. ప్రజల కొరకు ఆలోచన చేసి ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం ఇచ్చినామని అన్నారు. 10ఎళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలే గత ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చామని అన్నారు. భారత్ దేశంలోనే ఒక్క కంప్లెంట్ లేకుండా సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.
Also Read: Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో మామూలుగా ఉండదు.. వార్ వన్ సైడే, మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం
అలాగే మహిళలకు ఉచిత బస్సు, కరెంట్ అందించామని, గోదావరి కృష్ణ బేసిన్ లో అధిక నీటిని వినియోగంలోకి తెచ్చాము అలాగే ఎక్కువ పంటను సాగులో కి తెచ్చాము 19వేల కోట్లు ఖరీప్లో రైతులకు డబ్బులు చెల్లించండం జిరగిందని అన్నారు. హైదరాబాద్ లనే భీంగల్ మున్సిపాలిటీకి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇతర పార్టీలకు ఓటేసి వృధా చేసుకోకండని అన్నారు. పట్టణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ కి ఓటు వేయండని మంత్రి ఉత్తం అన్నారు.
Also Read: Tiger: వనం వదిలి జనం వైపు.. పులి అడుగుల వెనుక అసలు కథ!