E-Paper
Advertisement

CPM: కేంద్ర బడ్జేట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు

CPM: కేంద్ర బడ్జేట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు
Advertisement

CPM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో పేదల బతుకులను మర్చిపోయారని సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య(Pagadala Yadiah) విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఉపయోగపడే విధంగా లేదని అన్నారు.

డేటా సెంటర్ల పేరుతో రాయితీలు

కేంద్ర ప్రభుత్వం వి.బి జి.రాంజి పథకానికి కేవలం రూ.93వేల కోట్లు కేటాయించి గతంతో పోలిస్తే కోత పెట్టారని తెలిపారు. వ్యవసాయ రంగానికి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల సంక్షేమానికి నిధులు తగ్గించారని అన్నారు. దేశ కార్పొరేట్ సంస్థలైన ఆదానీ, అంబానీ తదితరులకు డేటా సెంటర్ల పేరుతో రాయితీలు ప్రకటిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు, ఎరువుల రాయితీలు, చిన్న పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హెూదా యివ్వాలని కోరుతున్నా వాటి ఊసే లేదన్నారు. రాష్ట్రంలో 8మంది బిజేపి ఎంపీలు, మంత్రులు వున్నప్పకీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో విఫలం అయ్యారు. కాబట్టి పూర్తిగా సామాజిక తరగతులను, శ్రామిక వర్గాల ప్రయోజనాలకు కేటాయింపులు చేయకుండా కార్పొరేట్ ప్రయోజనాలకే ఉపయోగపడే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అన్నారు.

Advertisement

Also Read: Facepack: కేవలం యాభై రూపాయలతో ముఖాన్ని ఇలా మెరిపించేయండి, ఇదొక్కటి చాలు

కేంద్రంపై వత్తిడి తెచ్చి నిధులు

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి నిధులు రాబట్టడానికి కృషి చేయాలని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించి, ప్రజా ప్రయోజనాలకు, సామాజిక తరగతుల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సామెలు, డి. రాంచందర్, డి. జగదీశ్, జి. కవిత, ఇ. నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు సి. హెచ్. బుగ్గరాములు, జె. రుద్ర కుమార్, డి. కిషన్, పి. జగన్, టౌన్ కార్యదర్శి సి. హెచ్. ఏల్లేష్, నాయకులు స్వప్న, పురుషోత్తం, తావు నాయక్, బోడ యాదగిరి, ఇ. వీరేష్, శపి ఉన్నిసా, తింక యాదగిరి, గుడేటి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Ramprasad Reddy on YCP: అంబటి ఓ టిష్యూ పేపర్.. జగన్ వాడుకొని పాడేస్తాడు.. మంత్రి మండిపల్లి సంచలన వ్యాఖ్యలు

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×