E-Paper
Advertisement

Rajendra Nagar: బేకరీలో పేలిన సిలిండర్.. 15 మందికి గాయాలు.. సీఎం దిగ్భ్రాంతి

Rajendra Nagar: బేకరీలో పేలిన సిలిండర్.. 15 మందికి గాయాలు.. సీఎం దిగ్భ్రాంతి
Advertisement

Rajendra Nagar: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఒక బేకరీలో గురువారం పేలుడు సంభవించింది. బేకరీ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 మంది గాయపడ్డారు. వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదస్థలంలో పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్రగాయాలై ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన విజయరాం, నాని అనే ఇద్దరు వ్యక్తులు రాజేంద్రనగర్ పారిశ్రామికవాడలో ఒక బేకరీని రన్ చేస్తున్నారు. ఈ బేకరీలో సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

Advertisement

ప్రతిరోజూ మాదిరిగానే గురువారం ఉదయం కూడా బేకరీలోకి ఆహార పదార్థాలను తయారు చేస్తుండగా.. గ్యాస్ పైప్ లీక్ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అవి వంటగది మొత్తం చుట్టుముట్టడంతో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×