E-Paper
Advertisement

Rajendra Nagar: బేకరీలో పేలిన సిలిండర్.. 15 మందికి గాయాలు.. సీఎం దిగ్భ్రాంతి

Rajendra Nagar: బేకరీలో పేలిన సిలిండర్.. 15 మందికి గాయాలు.. సీఎం దిగ్భ్రాంతి

Rajendra Nagar: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఒక బేకరీలో గురువారం పేలుడు సంభవించింది. బేకరీ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 మంది గాయపడ్డారు. వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదస్థలంలో పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్రగాయాలై ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన విజయరాం, నాని అనే ఇద్దరు వ్యక్తులు రాజేంద్రనగర్ పారిశ్రామికవాడలో ఒక బేకరీని రన్ చేస్తున్నారు. ఈ బేకరీలో సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

ప్రతిరోజూ మాదిరిగానే గురువారం ఉదయం కూడా బేకరీలోకి ఆహార పదార్థాలను తయారు చేస్తుండగా.. గ్యాస్ పైప్ లీక్ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అవి వంటగది మొత్తం చుట్టుముట్టడంతో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×