E-Paper
Advertisement

Dhanwantari Foundation Fraud: ఫౌండేషన్ పేరుతో భారీ మోసం.. 540 కోట్లు స్వాహా !

Dhanwantari Foundation Fraud: ఫౌండేషన్ పేరుతో భారీ మోసం.. 540 కోట్లు స్వాహా !

Dhanwantari Foundation Fraud: హైదరాబాద్‌లో ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. పౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపి భారీ మొత్తంలో డబ్బులు కాజేశారు. తాజాగా ఇదంతా మోసం అని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ధన్వంతరి ఫౌండేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్వాహకులు కమాలకర్ శర్మ బాధితులపై ఒత్తిడి తెచ్చాడు. పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని మభ్యపెట్టాడు. ఈ క్రమంలోనే వారు పెట్టిన పెట్టుబడులకు ప్లాట్స్ ఇస్తామని ఆశ చూపించారు. దీంతో నాలుగు వేల మంది దగ్గర సూమారు రూ. 540 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించారు. బాధితులు అందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్షం. అయితే ఇదంతా మోసం అని గమనించిన బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో బాధితులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ శ్వేతా రెడ్డి మాట్లాడుతూ కమలాకర్ శర్మను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను సీసీఎస్‌కు అటాచ్ చేసినట్లు తెలిపారు. అలాగే సీజ్ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు వచ్చేలా చూస్తామన్నారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×