DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల కేంద్రంగా రెండు ప్రధాన జాతీయ రహదారులను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరిని కలిసి ఎంపీ డీకే అరుణ విన్నవించారు. గద్వాల కేంద్రంగా రెండు ప్రధాన జాతీయ రహదారులను ఏర్పాటు చేయడం ద్వారా పరువు రాష్ట్రాలకు రవాణా సౌలభ్యం పెరుగుతుందని ఆమె కేంద్ర మంత్రికి విన్నవించారు.
ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన డీకే అరుణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంత అభివృద్ధికి కీలకమైన రెండు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల మంజూరు చేయాలని కోరారు. ఎర్రవల్లి – గద్వాల్ – రాయచూర్ రహదారి (67 కి.మీ) కొత్తకోట – గద్వాల్ – మంత్రాలయం రహదారి (90 కి.మీ) రహదారుల ప్రాధాన్యతను వివరించారు. ఈ రోడ్లు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతాయన్నారు. నూతన రహదారులను నెలకొల్పడం ద్వారా పర్యాటకం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తాయన్నారు.
Also Read: నన్ను ఉరితీయండి కానీ.. సీఎంకు పాడి కౌశిక్ రెడ్డి భావోద్వేగ సవాల్!
తెలంగాణలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న, జాతీయ రహదారి సమీపంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంతో పాటు మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలకు భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. గత15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మద్దతు తెలిపారన్నారు. ఇరిగేషన్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతలో ఈ రెండు గ్రీన్ ఫీల్డ్ రహదారులు ఎంతో అవసరమని డికె అరుణ కేంద్ర మంత్రికి తెలియజేస్తూ.. వెంటనే వాటిని పరిశీలించి మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు.
Also Read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎట్టకేలకు తెరుచుకున్న చలివేంద్రం