BigTV English

Dr BV Pattabhiram death: డాక్టర్ పట్టాభిరామ్ ఇక లేరు.. సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్!

Dr BV Pattabhiram death: డాక్టర్ పట్టాభిరామ్ ఇక లేరు.. సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్!
Advertisement

Dr BV Pattabhiram death: ఇంద్రజాల విద్య ద్వారా మూఢనమ్మకాలను పోగొట్టి, ప్రజల్లో చైతన్యం రగిలించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీవీ పట్టాభిరామ్ ఇక లేరు.. ఆయన మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగ సంతాపం వ్యక్తపరుస్తూ ట్వీట్ చేశారు.


తెలుగువారికి మానసిక దారిద్య్రాన్ని పోగొట్టే మార్గాన్ని చూపిన మాయాజాలికుడు, ప్రసిద్ధ రచయిత, ప్రసంగకర్త, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ ఇకలేరు. ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. ఈయన మరణ వార్తతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటిస్తూ.. ఇంద్రజాల విద్య ద్వారా ప్రజల్లో అవగాహన పెంచిన మహానుభావుడిని మనం కోల్పోయాం. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు.

పట్టాభిరామ్ ఇంద్రజాలికుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప మార్గదర్శిగా గుర్తింపు పొందారు. ఆయన చేపట్టిన మానసిక విజ్ఞాన శిక్షణ శిబిరాలు వేలాదిమందికి మార్గం చూపాయి. పాజిటివ్ థింకింగ్, మెమరీ పవర్, సెల్ఫ్ డెవలప్మెంట్, హిప్నాటిజం, స్పిరిట్యువల్ హీలింగ్ వంటి అంశాల్లో ఆయన చేసిన పనితనం అనన్యసాధారణం. ఆయన్ను ఒక మాంత్రికుడు అనడంలో లేదు తప్పు.. కానీ ఆయన మాయలో మతిబ్రమించడం లేదు. ఎందుకంటే ఆయన మంత్రాల కన్నా నిజాలు శక్తివంతమని నమ్మినవారు.


ఇంద్రజాల విద్యను వినోదంగా కాకుండా ప్రజలలోకి మేలుకలిపే ఒక సాధనంగా మార్చిన గొప్పవాడు పట్టాభిరామ్. మూఢ నమ్మకాలపై పోరాడుతూ, వాటిని వినోదాత్మకంగా విమర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఆయన జీవన ధ్యేయంగా మార్చుకున్నారు. దశాబ్దాల తరబడి టీవీ షోల్లో, శిక్షణ కార్యక్రమాల్లో, పుస్తకాల ద్వారా ఆయన జ్ఞానాన్ని అందించడమే కాదు.. అది ఉపయోగపడేలా మార్గనిర్దేశం కూడా చేశారు.

పట్టాభిరామ్ రచనలు ప్రతి ఇంటిలో ఒక కోణంలో కనిపిస్తాయి. జ్ఞాపక శక్తి పెంపొందించుకోవటం ఎలా, తప్పదు గెలవాల్సిందే, నీళ్ళనుండి నిప్పు, విజయ రహస్యాలు వంటి పుస్తకాలు లక్షలాది మందికి ప్రేరణగా నిలిచాయి. వీటిని చదివినవారిలో అనేక మంది జీవితాన్ని సానుకూల దిశగా మలచుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన సేవలను గుర్తు చేస్తూ.. ఇంద్రజాలం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అమోఘం. ప్రజోపయోగ కార్యక్రమాల్లో ఆయన చూపిన నిబద్ధతను మరువలేము. ఈ లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని తెలిపారు.

Also Read: India gas price news: గ్యాస్ సిలిండర్ ధర తగ్గిందోచ్.. కానీ ఒక ట్విస్ట్ ఉంది.. అదేమిటంటే?

అయన మరణం సినీ, సాహితీ, విద్యా, వైద్య రంగాలకు ఒక్కటే కాదు సామాజికంగా స్పష్టమైన లోటు. ఎందుకంటే పట్టాభిరామ్ ఒక విభిన్నమైన చింతనను సమాజానికి అందించినవారు. ఆయన జీవితం గమ్యం కోసమే కాక, మార్గం చూపించేదిగా ఉండేది. ఎటువంటి వేదిక అయినా మానవ మనస్సులో వెలుగు రేపే అంశాలే ఆయన్ను ప్రసిద్ధిపరచాయి.

పట్టాభిరామ్ మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞానం, రచనలు, శిక్షణలు, ప్రసంగాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన చూపిన మార్గంలో నడిచే వారికి ఇది ఒక వెలుగు చుక్కగా మారుతుంది. నిజంగా చెప్పాలంటే.. జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా ఎదగాలో చెప్పిన వారిలో ఒక చిరస్మరణీయుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్.

Related News

KTR: దొంగ ఓట్లతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోంది.. కేటీఆర్ సంచలన ఆరోపణలు నిజమెంత..?

Kalvakuntla Kavitha: కవితను అడ్డుకున్న పోలీసులు.. చిక్కడపల్లిలో హై టెన్షన్

Konda Surekha: మేడారం టెండర్ల విషయంలో మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. నా ఉద్దేశమదే..!

Maoist Party: మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం.. ఆయుధాలు వదిలేసిన మల్లోజుల.. ఇతను ఎవరంటే..?

Mahesh Kumar Goud: జీవో నంబర్ 9 ఒక చారిత్రాత్మకం.. హైకోర్టు స్టేపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Election Commission: అది ఇల్లు కాదు అపార్ట్మెంట్.. కేటీఆర్‌కు ఈసీ షాక్

Rajgopal Reddy: వైన్ షాప్స్ టైమింగ్స్ మార్పు.. ఇక నుంచి ఇన్ని గంటలకే.. రాజగోపాల్ రెడ్డి కీలక ఆదేశాలు

Asaduddin Owaisi: జూబ్లీహిల్స్‌లో మా మద్దతు ఆ పార్టీకే.. ఓవైసీ సంచలన నిర్ణయం.. గెలుపు ఆ పార్టీదే..?

Big Stories

×