Hyd Real Estate: ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్లోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. జనప్రియ, రాజా డెవలపర్స్, సత్యసాయి, గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్స్తో సహా మొత్తం ఐదు సంస్థలు ఈ సోదాలలో లక్ష్యంగా మారాయి. మనీలాండరింగ్ అనుమానాల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.
ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్లు ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.60 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమ నగదు చలామణిని నియంత్రించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.
ఈ సోదాలలో ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోళ్లు అమ్మకాలు జరిగిన విధానంపై దృష్టి సారించారు. జనప్రియ, రాజా డెవలపర్స్ వంటి సంస్థల ఆర్థిక వ్యవహారాలు చాలాకాలంగా ఈడీ నిఘాలో ఉన్నాయి. ఈ సంస్థల డైరెక్టర్లు ప్రమోటర్లను కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. దాడులు పూర్తి కాగానే ఈడీ పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పారదర్శకత లేకపోవడం అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టడంపై ఈడీ ఈ దాడులు నిర్వహించింది.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్ మనీ చెలామణి అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ దాడుల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై కొంతమేర ఉండే అవకాశం ఉంది. ఈడీ విచారణ పూర్తి అయితే మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: CM Revanth Reddy: నోయిడా తరహాలో కొడంగల్.. రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన