Municipal Elections: రాష్టంలోని 116 మున్సిపాల్టీలు, మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న పుర పాలక ఎన్నికల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 2.02 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. దీంతో పాటు రూ.84.89 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు కూడా కమిషన్ తెలిపింది. స్వాధీనం చేసుకున్న సొత్తులో సుమారు రూ.89.30 లక్షల నగదుతో పాగటు రూ. 13.27 లక్షల డ్రగ్స్, మరో రూ. 14.69 లక్షల వెండి, బంగారు ఆభరణాలు, మరో రూ. 78 వేల ట్యాబ్స్, వాహానాలను కూడా సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.
Also Read: Artificial Lung System: వైద్య రంగంలో అద్భుతం.. ఊపిరితిత్తులు లేకుండానే రెండు రోజుల పాటు ప్రాణాలతో!
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు మొత్తం రూ. 2.02 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కమిషన్ తెలిపింది. కాగా, ఈ మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల 11న పోలింగ్, 13న కౌటింగ్ నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తూనే, ఎలక్షన్ కోడ్ ను పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఎస్ఎస్ టీ, ఎఫ్ ఎస్ టీ బృందాలు విధి నిర్వహణలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొన్న మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ లలో పోలింగ్, కౌంటింగ్ పూర్తయిన తర్వాత మున్సిపాల్టీల చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్న ఎన్నికల అధికారులకు, మాస్టర్ ట్రెయినీలకు ఎన్నికల కమిషన్ వర్చ్యువల్ పద్దతిలో ఒక రోజు శిక్షణను ముగించినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Also Read:Wardhannapet Municipality: ఓట్ల కోసం బాల్యాన్ని బలి చేస్తారా? పిల్లల చేత కాళ్లు మొక్కించిన నేతలు!