CS Ramakrishna Rao: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ,వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఈపీటీఆర్ ఐ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్ షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన తరగతులను జేఎన్ టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలలో నిర్వహించాలన్నారు. పబ్లికేషన్స్ కు మరింత ప్రయారిటీ ఇవ్వాలన్నారు. ఈపీటీఆర్ ఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం సచివాలయంలో జరిగింది.
Also Read:Hydra: రూ. 85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
ఈ సమావేశానికి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హజరై మాట్లాడుతూ ఈపీటీఆర్ ఐ ద్వారా అమలవుతున్న ప్రస్తుత కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, శిక్షణా కార్యక్రమాలు, పరిశోధన ప్రాజెక్టులు, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక అంశాలపై బోర్డ్ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా పర్యావరణ అనుకూల కార్యక్రమాలను వేగవంతం చేయాలని, వివిధ శాఖలతో సమన్వయం పెంచాలని ఆయన సూచించారు.పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి, వాయు కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంపకం వంటి అంశాల్లో చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
Also Read: Ranveer Singh: భార్యను ఫాలో అవుతున్న బాలీవుడ్ హీరో.. అసలు మ్యాటర్ ఏంటంటే..?