E-Paper
Advertisement

MP Etela Rajender: సీఎం రేవంత్‌ రెడ్డిని కేసీఆర్‌తో పోల్చిన ఎంపీ ఈటల రాజేందర్.. ఎమన్నారంటే..?

MP Etela Rajender: సీఎం రేవంత్‌ రెడ్డిని కేసీఆర్‌తో పోల్చిన ఎంపీ ఈటల రాజేందర్.. ఎమన్నారంటే..?
Advertisement

MP Etela Rajender: మాజీ సీఎం కేసీఆర్ లెక్కనే ఇప్పటి సీఎం రేవంత్ చుట్టూ ల్యాండ్ మాఫియా, ల్యాండ్ బ్రోకర్లు తయారయ్యారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిన్న జరిగిన అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, మేధావులు, ఎస్సీ ఎస్టీ సంఘాల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఈటల చీఫ్​ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఎల్లమ్మబండలో ఉన్న ప్రభుత్వ భూమి.. ప్రైవేట్ భూమి అని సుప్రీంకోర్టులో నెగ్గారని, అంటే వారితో కాంగ్రెస్ర్ ప్రభుత్వం ఎంతగా కొల్యూడ్ అయిందో అర్థమవుతోందని, ఆ భూమి విలువ రూ.7వేల కోట్లు అని చెప్పారు.

Also Read: Suspense thriller OTT: అమ్మాయిలకు నరకం చూపించే జైలు… ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితమే

మాఫియా చేతిలో ఉన్న భూమి..

Advertisement

హైడ్రా వస్తే పేదల భూములు, ఇల్లు, పార్కులు కాపాడుతారని అనుకున్నామని, ల్యాండ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అనుకున్నామని, కానే హైడ్రా ఈ ల్యాండ్ బ్రోకర్లకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. గాజులరామారంలో దగ్గర సర్వేనెంబర్ 7లో 300 ఎకరాల భూమిలో 40 గజాల్లో గుడిసెలు వేసుకుంటే వాటిని కూలగొట్టారని, కానీ ల్యాండ్ మాఫియా చేతిలో ఉన్న భూమిని మాత్రం ముట్టలేదని ఫైరయ్యారు. హైడ్రా(Hydraa) భూమాఫియాకు కొమ్ము కాస్తోందని ధ్వజమెత్తారు. పేరుకే ప్రజాస్వామ్యం తప్ప పవర్ అంతా సెంట్రలైజ్ అయిపోయిందని ఈటల పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ కు చీమకుట్టినట్టు కూడా లేదని ఫైరయ్యారు. సీఎం ఇప్పటికైనా స్పందించకపోతే తెలంగాణ సమాజం తిరగబడుతుందని హెచ్చరించారు.

Also Read: YouTuber Komali: సూసైడ్ చేసుకుని యూట్యూబర్ కోమలి మృతి.. ఏం జరిగిందంటే?

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×