E-Paper
Advertisement

జేయియి మేయిన్స్‌లో ఎక్సెలెన్షియా ప్రభంజనం..హిస్టరీ రిపీట్..!

జేయియి మేయిన్స్‌లో ఎక్సెలెన్షియా ప్రభంజనం..హిస్టరీ రిపీట్..!

JEE Results: స్వేచ్ఛ బ్యూరో: జేఈఈ మెయిన్–2026లో ఎక్సెలెన్షియా విద్యాసంస్థలు విశేష ఫలితాలు సాధించాయి. “ప్రతి విద్యార్థి రాణించగలడు” అనే థీమ్‌తో ముందుకెళ్తున్న ఈ సంస్థ, అన్ని బ్యాచ్‌ల నుంచి గణనీయ విజయాలను నమోదు చేసింది. బుధవారం శామీర్‌పేట్‌లోని ఎక్సెలెన్షియా కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా టాప్..

అకాడెమిక్ హెడ్ జాన్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఫలితాలు 250 శాతం పెరిగాయని తెలిపారు. సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు సమానంగా రాణించారని, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులూ మంచి ఫలితాలు సాధించడం సంస్థ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జంషెడ్ తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా టాప్ 1 శాతంలో 12 మంది, టాప్ 2 శాతంలో 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పునాది బలంగా లేకున్నా సీబీఎస్ఈ విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించారని తెలిపారు. 10వ తరగతిలో నెమ్మదిగా ఉన్న విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో అర్హత సాధించడం గర్వకారణమన్నారు.

Also read: మహా నగరంలో పైసల కష్ట్రాలు.. కొత్త కార్పోరేషన్లకు జీతాల గండం

అడ్మిషన్లలో 70 శాతం..

డైరెక్టర్ వెంకట్ మురికి లక్ష్యం అయిన నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులను తీర్చిదిద్ది రాణించేలా చేయడం సాకారమైందని తెలిపారు. హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఈశ్వరన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది సహకారంతో ఈ విజయాన్ని సాధించామని తెలిపారు. అడ్మిషన్లలో 70 శాతం రిఫరెన్స్ ద్వారా రావడం సంస్థపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.

Also Read: ఉమ్మడి మెదక్ జిల్లాలో కదం తొక్కిన ఆర్‌టీసీ కార్మికులు

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×