E-Paper
Advertisement

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్దమర్రి గ్రామం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మూడుచింతలపల్లి మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి బూజు, మొలకలు వచ్చి నష్టపోతున్నట్లు తెలిపారు.

దాదాపు 20 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, వర్షం పడితే తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టడమే తమ పనిగా మారిందని రైతులు వాపోయారు. మరోవైపు పాఠశాలలు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతున్నప్పటికీ పాఠశాల ఆవరణల్లో పోసిన ధాన్యం కుప్పలు అలాగే ఉండిపోయాయని పేర్కొన్నారు.

Advertisement

అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.

Also Read: కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×