E-Paper
Advertisement

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్దమర్రి గ్రామం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మూడుచింతలపల్లి మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి బూజు, మొలకలు వచ్చి నష్టపోతున్నట్లు తెలిపారు.

దాదాపు 20 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, వర్షం పడితే తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టడమే తమ పనిగా మారిందని రైతులు వాపోయారు. మరోవైపు పాఠశాలలు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతున్నప్పటికీ పాఠశాల ఆవరణల్లో పోసిన ధాన్యం కుప్పలు అలాగే ఉండిపోయాయని పేర్కొన్నారు.

అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.

Also Read: కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక

Related News

ధాన్యం రవాణా ఆలస్యంపై మెదక్ ఎస్పీ యాక్షన్.. డీఎస్పీకి కీలక ఆదేశాలు!

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్ట్, దిష్టిబొమ్మ దహనం!

సిద్దిపేటలో పర్యావరణ వేడుకలు.. మంత్రి పొన్నం, ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు!

కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక

Bolla Brahma Naidu Arrest: చిక్కిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. తమిళనాడులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్.. డే అండ్ నైట్ వానలే వానలు

Miryalaguda: మిర్యాలగూడలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలుడులో కొత్త విషయాలు, ముగ్గురు సజీవ దహనం

Big Stories

×