E-Paper
Advertisement

Farmhouse Case: శంషాబాద్ స్టేషన్‌లో 9 గంటల సుదీర్ఘ విచారణ.. ఫామ్ హౌస్ కేసులో విస్తుపోయే నిజాలు

Farmhouse Case: శంషాబాద్ స్టేషన్‌లో 9 గంటల సుదీర్ఘ విచారణ.. ఫామ్ హౌస్ కేసులో విస్తుపోయే నిజాలు
Advertisement

Farmhouse Case: ఫాం హౌజ్ డ్రగ్స్ , కాల్పుల కేసులో సిట్ (SIT) విచారణ అత్యంత వేగంగా కొనసాగుతోంది. మొదటి రోజు విచారణలో భాగంగా నిందితులను దాదాపు 9 గంటల పాటు పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న ఈ విచారణను ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు.

విచారణలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు సరిగ్గా సహకరించడం లేదని సమాచారం. ఫాం హౌజ్‌లో జరిగింది కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమేనని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు, కాల్పుల ఘటనపై గన్‌మెన్ నమిత్ శర్మ విస్తుపోయే నిజాలు వెల్లడించారు. లోపలికి వచ్చింది పోలీసులని తనకు తెలియదని, భాషా సమస్య వల్ల వారిని ఎవరో దాడులు చేయడానికి వచ్చిన వారుగా భావించి కాల్పులు జరిపానని పేర్కొన్నారు. రితేష్ రెడ్డి ‘హమ్ దేక్ లేతే.. తూ ఫైర్ కరో’ (మేం చూసుకుంటాం.. నువ్వు కాల్పులు జరుపు) అని చెప్పడం వల్లే తాను కాల్పులు జరిపానని నమిత్ శర్మ వివరించారు.

Advertisement

ఈ కేసులో తాజాగా మరో నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరికి కూడా పోలీసులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకోకముందే పార్టీలో ఉన్న ఇతర వ్యక్తుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసిన పోలీసులు, వాటిని నిందితుల ముందు ఉంచి విచారించారు. ముఖ్యంగా అభిషేక్ సింగ్ డ్రగ్ నెట్వర్క్‌పై సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు.

మొదటి రోజు విచారణ ముగిసిన అనంతరం రోహిత్ రెడ్డి తరపు అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకు తమ సమక్షంలోనే విచారణ జరిగిందని, నిందితులు అందరూ సహకరించారని ఆయన తెలిపారు. నమిత్ శర్మ తిరుమల దర్శనం కోసం వచ్చాడని, దానికి సంబంధించిన టికెట్లను కూడా చూపించామని చెప్పారు. అది కేవలం స్నేహితులతో చేసుకున్న పార్టీ మాత్రమేనని, డ్రగ్స్‌కు లేదా కాల్పులకు రోహిత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Also Read: అమృత్ 2.0 సమీక్షలో ఎంపీ చామల.. హైదరాబాద్ అభివృద్ధి ఫైళ్లపై కీలక చర్చ

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×