MP Chamala: భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ నిర్వహించిన ‘అమృత్ & అమృత్ 2.0’ పథకాల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలోని పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ గురించి ఆయన ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుమారు 7,444 కి. మీ పొడవైన ఈ డ్రైనేజీ నెట్వర్క్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 17,212 కోట్లుగా ఉందని.. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించడం అత్యవసరమని ఆయన వివరించారు.
దీంతో పాటు, ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ గురించి కూడా ఎంపీ చర్చించారు. సుమారు రూ. 4వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు , నిధుల మంజూరులో జాప్యం జరుగుతోందని, దీనివల్ల పనుల పురోగతికి ఆటంకం కలుగుతోందని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, కేంద్రం రాజకీయాలకు తావులేకుండా ఈ భారీ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ ముందు రాష్ట్ర అవసరాలను బలంగా వినిపించిన ఆయన, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరని స్పష్టం చేశారు.
Also Read:సినిమాను తలపించే సీన్.. మనుషులు చేయలేని పనిని ఈ కుక్కలు చేసి చూపించాయి!
పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ నిర్వహించిన అమృత్ & అమృత్ 2.0 సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీ
హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ (7,444 కి.మీ నెట్… pic.twitter.com/SfPEe63bHP
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2026