E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో బస్సు కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి, ఏం జరిగింది?

Hyderabad News: హైదరాబాద్‌లో బస్సు కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి, ఏం జరిగింది?
Advertisement

Hyderabad News: ఉచిత బస్సులు ఏమోగానీ ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ఉద్యోగులపై ప్రయాణికులు దాడులు చేస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ సిటీలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. మహిళా కండక్టర్‌పై  ప్రయాణికులు ఏకంగా దాడికి దిగింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

హైదరాబాద్ సిటిలో ఫలక్‌నుమా నుండి సికింద్రాబాద్ సిటీ బస్సు మహిళా కండక్టర్‌పై దాడి చేసింది ఓ ప్రయాణికురాలు. బస్సు ఎక్కిన ఆ ప్రయాణికులురాలు తనకు అనుకూలమైన ప్రాంతంలో బస్సు ఆపాలని డ్రైవర్‌ను‌ను కోరింది. తాము ఎక్కడ పడితే అక్కడ ఆపమని డ్రైవర్‌తోపాటు మహిళా కండక్టర్‌ చెప్పారు.

Advertisement

కోపానికి గురైన పాసింజర్ బూతులు తిట్టింది. కండక్టర్-ప్రయాణికులు మధ్య మాటా మాటా చోటు చేసుకుంది. చివరకు పట్టరాని కోపంతో కండక్టర్‌పై దాడికి దిగింది. ఏకంగా ఆమె పీక పట్టుకుంది పాసింజర్. ఈ తతంగం చాలాసేపు జరిగింది.  ఇద్దరు మహిళలు కావడంతో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకునేందుకు ముందుకు రాలేకపోయారు.

అదే సమయంలో ఓ వ్యక్తి కండక్టర్-ప్రయాణికురాలి మధ్య వాగ్వాదానికి తన ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇదేకాదు నాలుగురోజుల కిందట ఏపీలోని అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. బస్సు ఆపలేదని మహిళా పాసింజర్.. డ్రైవర్‌ని చెంపపై కొట్టింది.

Advertisement

ALSO READ: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తస్మాత్ జాగ్రత్త

అంతకుమందు తెలంగాణలో కొన్ని ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి దాడులను గమనించిన ఆర్టీసీ యాజమాన్యం విధుల్లో ఉన్నవారిపై దాడి చేయడం చట్ట రీత్యా నేరమని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని  తాటికాయంత అక్షరాలతో ఆర్టీసీ బస్సుల్లో బోర్డులు పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×