BigTV English

Industrial Estate: పాశమైలారం పారిశ్రామికవాడ.. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్, ఎనిమిది మంది మృతి

Industrial Estate: పాశమైలారం పారిశ్రామికవాడ.. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్, ఎనిమిది మంది మృతి

Industrial Estate: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు చోటు చేసుకుంది. సిగాచీ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మంటలు అదుపులోకి వస్తే లోపల ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సివుంది.


సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. రియాక్టర్ పేలిన భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్లు దూరం ఎగిరిపడ్డారు.

రియాక్టర్ పేలుడు దాటికి ఉత్పత్తి చేస్తున్న భవనం కుప్పకూలింది. మరో భవనానికి బీటలు భారీగా బీటలు వచ్చాయి. క్వాలిటీ కంట్రోల్ భవనంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ రెండు భవనాల్లో సుమారు 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మరికొందరు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది.


మంటలకు కొందరికి శరీరాలు కలిపోగా, కొందరికి చేతులు, ఇంకొందరికి కాళ్లు విరిగినట్టు సమాచారం.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మంది కార్మికులను వెంటనే అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఐదురుగు మృత్యువాత పడగా, ఆసుపత్రిలో మరొకరు మరణించారు.

ALSO READ: మహాలక్ష్మి కళ్లలో ఆనందం.. అకౌంట్లు చెక్ చేసుకోండి

ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే 11 ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ఆ ప్రాంతంలో ఎంతమంది కార్మికులు ఉన్నారనేది తెలియాల్సివుంది.

మార్నింగ్ షిప్ట్‌కు వచ్చిన కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు చెబుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో చుట్టు పక్కల పరిసరాలకు ఘాటైన వాసనలు వ్యాపించాయి. ఆ వాసనతో చుట్టు పక్కల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఘటన స్థలంలో ఐదుగురు, ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

బాధితులు ప్రస్తుతం చందానగర్, ఇస్నాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలియగానే సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలు అక్కడికి చేరుకున్నారు. జరుగుతున్న సహాయక చర్యలపై వివరాలు సేకరించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఘటనా సమయంలో 100 నుంచి 120 మంది కార్మికులు లోపల ఉన్నట్టు సమాచారం.

 

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×