Lake Pollution: స్వేచ్ఛ బ్యూరో: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిది గుండ్ల, నీళ్ల చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మించిన విల్లాస్ నుంచి డ్రైనేజీ నీటిని సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండానే మురుగు నీటిని చెరువులో కలపడం వల్ల నీటి నాణ్యత క్షీణించి, చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి చేరుతున్న కలుషిత నీటిలో రసాయనాలు, బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు అధికంగా ఉండటంతో నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయితున్నాయని దింతో చెరువుపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దాతల సహకారంతో.. మానవీయతకు మారుపేరుగా నిలిచిన ఓ వివాహం..!
చేపల మరణంతో చేపల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆదాయం లేకుండా పోతోందని లక్షల్లో నష్టం వాటిల్లుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, విల్లాస్ నుంచి వచ్చే డ్రైనేజీ నీరు నేరుగా చెరువులో కలుస్తుండటంతో నీరు నల్లగా మారి దుర్వాసన వల్ల చెరువుల్లో చేపల మృతికి కారణమయ్యాయని తెలిపారు. ఈ సమస్యపై కాలుష్య నియంత్రణ శాఖ, స్థానిక మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నో స్టాక్ మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. ఉమ్మడి జిల్లాలో ఇంధన సంక్షోభం!